ఢిల్లీలో వాయుకాలుష్యం మళ్లీ విజృంభిస్తోంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) గణాంకాల ప్రకారం వజీపూర్లో 410, అలీపూర్లో 405, ఆనంద్ విహార్లో 401, పంజాబీ బాగ్లో 387, ఐటవోలో 384, ఆర్కేపురంలో 376, లోధిరోడ్లో 311 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్( ఏక్యూఐ) నమోదైంది. వాయు కాలుష్యం పెరగడంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఇటీవల వాయుకాలుష్య నివారణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం తీర్మానించింది.