
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,504 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,35,656 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,324గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,16,353 మంది కోలుకోగా ప్రస్తుతం 17,979 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 14,938 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. కాగా రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయనుకునే సమయంలో మళ్లీ కేసుల సంఖ్య పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.