Homeజాతీయ వార్తలుఇక రిజిస్ట్రేషన్లు స్ట్రాట్.. ధరణి పోర్టల్‌ నేడే షురూ..

ఇక రిజిస్ట్రేషన్లు స్ట్రాట్.. ధరణి పోర్టల్‌ నేడే షురూ..

KCR to launch Dharani portal from Muduchintalapalli today

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్‌ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ఈ ధరణి వెబ్‌ పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో ఇదో మైలురాయిగా నిలవనుంది. ధరణి ద్వారా ఇకపై తహసీల్దారు కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు అందనున్నాయి. దస్తావేజుల రాతలు అవసరం లేని ఈ విధమైన సేవలు వేరే ఏ రాష్ట్రంలోనూ లేవు.

Also Read: తనది కాని చోట..! ఎంపీగా గెలిచినా తృప్తి లేని ‘కోమటిరెడ్డి’..!

కాగా.. ఈ ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ప్రారంభించనున్నారు. ధరణి సేవలు అందుబాటులోకి వస్తే.. ఇప్పటివరకు కాగితాలపై కొనసాగుతున్న దస్త్రాల నిర్వహణ ఇకపై పోర్టల్‌లో డిజిటల్ రూపంలో కొనసాగుతాయి. భూమి యజమానికి తెలియకుండా భూ వివరాల్లో ఎటువంటి మార్పు చేర్పులకు వీలుండదు. యజమాని ఆధార్‌ కార్డు ఆధారంగానే దస్త్రాల్లో మార్పులు జరుగుతాయి.

భూమి యజమాని సెల్‌ఫోన్‌కు పంపే ఓటీపీ ఆధారంగానే ఈ మార్పులుచేర్పులు జరుగుతాయి. అక్రమంగా హక్కులు మార్చే పరిస్థితి లేదు. అంతేకాదు బయోమెట్రిక్‌తోనే దస్త్రాలు తెరుచుకుంటాయి. అంతేకాదు రిజిస్ట్రేషన్లు మ్యుటేషన్ల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది. రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖల సేవలను ఒకే సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచింది. దీనివల్ల వ్యవసాయ భూములను మండల తహసీల్దారు కార్యాలయాల్లోనే రిజిస్టర్‌ చేసుకోవచ్చు. గతంలో భూమిపై యాజమాన్య హక్కులు పొందాలంటే మ్యుటేషన్‌ కోసం గ్రామస్థాయిలో వీఆర్వో నుంచి డిప్యూటీ తహసీల్దారు వరకు పలుమార్లు తిరిగితే తప్ప పూర్తయ్యేదికాదు. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్‌ కాగానే మ్యుటేషన్‌ కూడా పూర్తయిపోతుంది.

Also Read: రాములమ్మా.. చల్లబడమ్మా..!

రాష్ట్రంలో ఇప్పటివరకు 141 సబ్‌ రిజిస్ట్రార్‌‌ ఆఫీసులు ఉన్నాయి. వీటికితోడు కార్యాలయాలను కూడా సబ్‌ రిజిస్ట్రార్‌‌ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే.. రాష్ట్రవ్యాప్తంగా 570 తహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు అమల్లోకి రానున్నాయి. ధరణి అమలుకు రూ.51.30 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతీ తహసీల్దార్‌ కార్యాలయానికి రూ.9 లక్షల చొప్పున కేటాయించింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version