ఎల్ వోసీలో కాల్పులు : జవాన్ మృతి

జమ్మూ కాశ్మీర్ లోని బరాముల్లా జిల్లాలో ఎల్ వోసీ వద్ద శుక్రవారం పాక్ కాల్పలు ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇక్కడ జరిగిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ రాకేశ్ దోవల్ వీరమరణం పొందారని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ లోని రిషికేష్ ప్రాంతానికి చెందిన రాకేశ్ , మరో సైనికుడు పాక్ కాల్పులను తిప్పికొట్టే ప్రయత్నం చేశారన్నారు. ఈ తరుణంలో రాకేశ్ మరణించగా మరో సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. అయితే సరిహద్దుల్లో ఇంకా కాల్పలు కొనసాగుతున్నాయన్నారు. ఇందులో బీఎస్ఎఫ్ […]

Written By: Suresh, Updated On : November 13, 2020 4:19 pm
Follow us on

జమ్మూ కాశ్మీర్ లోని బరాముల్లా జిల్లాలో ఎల్ వోసీ వద్ద శుక్రవారం పాక్ కాల్పలు ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇక్కడ జరిగిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ రాకేశ్ దోవల్ వీరమరణం పొందారని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ లోని రిషికేష్ ప్రాంతానికి చెందిన రాకేశ్ , మరో సైనికుడు పాక్ కాల్పులను తిప్పికొట్టే ప్రయత్నం చేశారన్నారు. ఈ తరుణంలో రాకేశ్ మరణించగా మరో సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. అయితే సరిహద్దుల్లో ఇంకా కాల్పలు కొనసాగుతున్నాయన్నారు. ఇందులో బీఎస్ఎఫ్ ధీటుగా స్పందిస్తుందన్నారు.