ఆస్ట్రేలియాలో సిడ్నీలో గురువారం ఉదయం నుంచి జరిగే మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగింది. అందకుముందు జాతీయ గీతం ఆలపించి ప్రారంభించిన ఆస్ట్రేలియా 21 పరుగులు చేసింది. ఈ మయంలో బౌలర్ సిరాజ్ తన తండ్రిని గుర్తుకు తెచ్చుకొని కంటతడి పెట్టాడు. రెండు చేతులతో కన్నీళ్లను తుడుచుకుంటున్నట్లు కనిపించడంతో అందరూ సిరాజ్ ను చూసి సానుభూతి వ్యక్తం చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తక్కువ స్కోరులోనే మొదటి వికెట్ కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్ ను సిరాజ్ బోల్తాకొట్టించాడు. ఇదే సమయంలో వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. అయితే కాసేపటి తరువాత వర్షం తగ్గడంతొ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు.