Homeజాతీయం - అంతర్జాతీయం14 కోట్ల మందికి కరోనా పరీక్షలు

14 కోట్ల మందికి కరోనా పరీక్షలు

corona-tests-telangana

దేశంలో కరోనా విలయం కొనసాగుతున్న వేళ వైరస్‌ నిర్ధరణ కోసం పరీక్షలు భారీగానే చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నవంబరు 30 నాటికి 14 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకూ 14,13,49,298 పరీక్షలు చేసినట్లు తెలిపింది. నవంబరు 21వ తేదీకి 13 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య తొమ్మిది రోజుల్లోనే గణనీయంగా పెరిగింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రెండో, మూడో వేవ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version