spot_img
Homeఅత్యంత ప్రజాదరణమోదీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇల్లు కొనేవారికి రూ.2.67 లక్షల తగ్గింపు..?

మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇల్లు కొనేవారికి రూ.2.67 లక్షల తగ్గింపు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ల ద్వారా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు కేంద్రం ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ లలో పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో చేరడానికి కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉంది. సొంతింటి కలను సాకారం చేసుకోవలనుకునే వాళ్లు ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఏకంగా రూ.2.67 లక్షల తగ్గింపును పొందవచ్చు.

మార్చి 31వ తేదీ వరకు ఈ స్కీమ్ అమలు కానుండగా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేస్తే మాత్రమే ఈ ప్రయోజనం చేకూరనుంది. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ద్వారా ఈ స్కీమ్ ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేస్తే ఈ స్కీమ్ ద్వారా రూ.2.67 లక్షల తగ్గింపు లభిస్తుంది. ఆధార్ కార్డును కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

కనీసం 100 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. తక్కువ ఆదాయం ఉన్నవారు, ఆర్థికంగా వెనుకబడిన వారు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించి మరికొన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

కొన్ని రోజుల వరకు మాత్రమే ఈ స్కీమ్ అమలవుతూ ఉండటంతో ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఇల్లు కొనాలని అనుకునే వాళ్లకు మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version