spot_img
Homeఅత్యంత ప్రజాదరణటీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి.. ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు..!

టీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి.. ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు..!

IT notices for MLAsతెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈక్రమంలోనే దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సిట్టింగ్ కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ మేయర్ పీఠానికి చాలా దూరంలో ఆగిపోయింది. టీఆర్ఎస్ కు తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుండటంతో సీఎం కేసీఆర్ కేంద్రంతో అమీతుమీకి సిద్ధమయ్యారు.

Also Read: రైతుల ఆందోళనలపై వెనక్కి తగ్గని ప్రభుత్వం..!

భారత్ బంద్ తో కేంద్రంపై ప్రత్యక్ష పోరుకు టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వరుసగా నోటీసులు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన 25మంది ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ నుంచి నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మాత్రం ఎమ్మెల్యేలు బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

2014 ఎన్నికల అఫిడవిట్ కు 2018 ముందస్తు ఎన్నికల సమయానికి అభ్యర్థులు సమర్పించిన ఆదాయంలో భారీగా తేడాలుండటాన్ని ఐటీ శాఖ గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నాలుగేళ్ల కాలంలో పెద్దమొత్తంలో ఆదాయం ఎలా పెరిగిందో చెప్పాలని ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపినట్లు సమాచారం. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది.

2014.. 2018 అఫిడవిట్‌లో అభ్యర్థులు పేర్కొన్న గణాంకాలే ఐటీ అధికారులు ఐటీ నోటీసులు పంపడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. నాలుగేళ్లలో 10శాతానికి పైగా ఎక్కువ సంపదను చూపినవారికే ఈ నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కాగా నాలుగేళ్లలో సీఎం కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ తోసహా పలువురు ఎమ్మెల్యేల ఆస్తులు గణనీయంగా పెరిగాయి.

Also Read: చావుదెబ్బ తిన్నా కాంగ్రెస్ మారదా?.. అప్పటి వరకు ఉత్తమే టీపీసీసీ చీఫ్..!

దీంతో ఐటీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఎవరెవరా? అనే ఆసక్తి నెలకొంది. ఐటీ శాఖ నుంచి నోటీసులు  వచ్చిన విషయాన్ని ఎమ్మెల్యేలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఐటీ శాఖ సైతం నోటీసులు ఎవరెవరెకీ జారీ చేసింది అనేది అధికారికంగా వెల్లడించడం లేదు.

కేసీఆర్ కేంద్రంతో పోరుకు సిద్ధమైన తరుణంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోటీసులు జారీ అయ్యాయా? లేక ఐటీ అధికారుల రోటీన్ చెకప్ లో భాగంగా నోటీసులు జారీ చేశారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మున్మందు ఈ ఐటీ నోటీసుల వ్యవహారం రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని ఆసక్తిని రేపుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper
Exit mobile version