spot_img
Homeప్రత్యేకంభారీగా తగ్గిన గుడ్ల ధరలు.. ఒక గుడ్డు ఎంతంటే..?

భారీగా తగ్గిన గుడ్ల ధరలు.. ఒక గుడ్డు ఎంతంటే..?

Eggs
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా గుడ్ల ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం ఒక గుడ్డు 5 రూపాయలు పలకగా తర్వాత రోజుల్లో ధరలు పెరిగి 6.00 రూపాయలు పలికింది. అయితే ఎట్టకేలకు గుడ్ల ధరలు దిగివచ్చాయి. కార్తీక మాసం వల్ల గుడ్ల వినియోగం భారీగా తగ్గడంతో గుడ్డు ధర ఏకంగా రూ 3.90కు పతనం కావడం గమనార్హం. కార్తీక మాసం ఎఫెక్ట్ వల్ల చికెన్ ధరలు సైతం తగ్గాయి.

Also Read: టీవీ, ఫ్రిజ్ కొనాలనుకునే వాళ్లకు షాకింగ్ న్యూస్..?

కార్తీకమాసం పూజలు చేసేవాళ్లు ఎక్కువగా ఉపవాసాలు ఉంటారు. కార్తీకమాసంలో చాలామంది మాంసంతో పాటు గుడ్డు కూడా తినడానికి ఆసక్తి చూపరు. ఫలితంగా గుడ్ల ధరలు భారీగా తగ్గాయి. డిమాండ్ తగ్గుతుండటంతో గుడ్ల ధరలు తగ్గగా కోళ్ల పెంపకం దారులు మాత్రం డిమాండ్ తగ్గడంతో తమకు భారీగా నష్టాలు వస్తున్నాయని వాపోతున్నారు. నెల రోజుల క్రితం వరకు ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతులు ఎక్కువగా ఉండగా ప్రస్తుతం ఎగుమతులు కూడా తగ్గుముఖం పట్టాయి.

Also Read: 2020 కంటే దారుణంగా 2021.. డబ్ల్యూఎఫ్‌పీ తీవ్ర హెచ్చరికలు..?

కోళ్ల పెంపకందారులు రోజురోజుకు కోళ్ల పెంపకానికి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని.. ఖర్చులు పెరుగుతున్న స్థాయిలో ఆదాయం మాత్రం పెరగడం లేదని చెబుతున్నారు. చలికాలం కావడంతో కోళ్లకు కృత్రిమ వేడి కోసం విద్యుత్ వినియోగం పెరిగిందని.. గుడ్ల ఉత్పత్తి మాత్రం గతంతో పోలిస్తే 5 శాతం వరకు తగ్గిందని చెబుతున్నారు. దాదాపు రెండు రూపాయలు గుడ్డు ధర తగ్గడంతో కోళ్ల పెంపకం లాభసాటిగా లేదని వ్యాపారులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

మరోవైపు ప్రాంతాన్ని బట్టి చికెన్ ధరల్లో సైతం మార్పులు ఉన్నాయి. నెల రోజుల క్రితం వరకు 200 రూపాయలకు పైగా కిలో చికెన్ పలకగా ప్రస్తుతం 140 నుంచి 200 రూపాయల లోపే కిలో చికెన్ లభ్యమవుతోంది. రోజురోజుకు ధరలు తగ్గడం వ్యాపారులను టెన్షన్ పెడుతోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version