Homeఅత్యంత ప్రజాదరణకరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా.. తినాల్సిన ఆహార పదార్థాలివే..?

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా.. తినాల్సిన ఆహార పదార్థాలివే..?

దేశంలో ఒకవైపు కరోనా కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంటే మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతే వేగంగా జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి లాంటి లక్షణాలు కొంతమందిలో కనిపిస్తున్నాయి. కొంతమందిలో మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం లేదు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల టెన్షన్ పడుతున్నారు.

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సరైన ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత వచ్చే ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఇమ్యూనిటీ పవర్ ను పెంచే, నీళ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సూప్స్ ను ఎక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు వెల్లడిస్తున్నారు.

మాంసం తినే వాళ్లు చికెన్, బోన్ సూప్స్ తీసుకుంటే త్వరగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నాన్ వెజ్ తినని వాళ్లు ఆలుగడ్డలు, బ్రకోలి, కాయధాన్యాలను తీసుకుంటే మంచిది. మరోవైపు 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారంతా వ్యాక్సిన్ వేయించుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వైద్యులు, సిబ్బంది సెలవులు తీసుకోకుండా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియకు హాజరవుతూ ఉండటం గమనార్హం.

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో లాక్ డౌన్ ను అమలు చేయకపోయినా కఠినంగా ఆంక్షలు అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Oktelugu Epaper
Exit mobile version