మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
దుబ్బాక నియోజకవర్గంలో మంగళవారం జరిగిన పోలింగ్ ను పరిశీలిస్తే ఓటర్లు భారీగా తరలివచ్చారు. 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కరోనా నేథప్యంలో ఓటింగ్ శాతం తగ్గుతుందని అందరూ భావించారు. కాని గత ఎన్నికల మాదిరిగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఇక కరోనాతో బాధపడుతున్న వారు సైతం పీపీఈ కిట్లు వేసుకొని ఓటేశారు. అధికార యంత్రాంగం సైతం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది.
Also Read: దుబ్బాక: నాటి ఫలితాలే పునరావృతం అవుతాయా..!
సాధారణంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకే కలిసివస్తాయి. నిన్న జరిగి ఎన్నికలోనూ తమదే విజయం అంటూ టీఆర్ఎస్ చెబుతోంది. సంక్షేమ పథకాల అమలుతో పాటు రైతు పక్షపాతిగా కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులయ్యారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే ప్రతిపక్ష బీజేపీ సైతం టీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలను ఆలోచింపజేసింది. దీంతో సోషల్ మీడియాలో ఎక్కువగా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓట్లు పడుతాయని ప్రచారం జరిగింది. అయితే ఓటింగ్ శాతంతో అధికార పార్టీ గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా ఎవరూ ఊహించని విధంగా దుబ్బాక ఎన్నిక ప్రక్రియ జరగడం రాజకీయంలో కొత్త పరిణామం..