Homeలైఫ్ స్టైల్PM Kisan: రైతులకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే పీఎం కిసాన్ డబ్బులు వచ్చే ఛాన్స్...

PM Kisan: రైతులకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే పీఎం కిసాన్ డబ్బులు వచ్చే ఛాన్స్ లేదట!

PM Kisan: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. కేంద్రం ఈ స్కీమ్ ద్వారా రైతులకు 6,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్రం మూడు విడతల్లో ఈ సాయాన్ని అందిస్తుండటం గమనార్హం. 2,000 రూపాయల చొప్పున కేంద్రం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలలో జమ చేయనుందని సమాచారం అందుతోంది. ఇప్పటివరకు పీఎం కిసాన్ పది విడతల నగదు ఖాతాలో జమైంది.

PM Kisan
PM Kisan

రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించాలనే ఆలోచనతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. https://pmkisan.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చనే సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్ 11వ విడత డబ్బులను పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీని పూర్తి చేయాలి. ఈకేవైసీ అప్ డేట్ చేసుకోవడం ద్వారా పీఎం కిసాన్ స్కీమ్ కు అర్హత పొందవచ్చు.

Also Read: మేడారానికి కేసీఆర్.. అమ్మవార్ల కోసం నిర్ణయం

పీఎం కిసాన్ వెబ్ సైట్ లో ఈ కేవైసీ ఆప్షన్ ను ఎంచుకుని ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించి పీఎం కిసాన్ వెబ్ సైట్ లో ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఈ స్కీమ్ కోసం అర్హతను పొందే అవకాశం ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ లోకి లాగిన్ కావడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఇచ్చే మొత్తాన్ని మరింత పెంచితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేంద్రం 2024 ఎన్నికల సమయానికి ఈ మొత్తం పెంచే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతుంది.

Also Read: మూడో కూట‌మిలో జ‌గ‌న్ చేరతారా? కేసీఆర్ తో క‌లుస్తారా?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version