Homeలైఫ్ స్టైల్Phone got wet on the rain: ఫోన్ వర్షం నీటిలో తడిసిందా? ఈ పొరపాట్లు...

Phone got wet on the rain: ఫోన్ వర్షం నీటిలో తడిసిందా? ఈ పొరపాట్లు అసలు చేయకండి..

Phone got wet on the rain: కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో , అయితే దాని కారణంగా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఆ సమయంలో బయట ఉన్నవారు మరింత ఎక్కువ ఇబ్బంది పడతారు. వారి స్మార్ట్‌ఫోన్‌లు వర్షంలో తడిసిపోతాయి. ఇది చాలా సార్లు జరుగుతుంది. కొన్ని సార్లు డ్రైవింగ్ లో ఉంటాయి. ఆ సమయంలో కూడా నానిపోతుంటాయి. అయితే ఇటువంటి స్థితిలో, చాలా మంది భయపడి వెంటనే ఫోన్‌ను ఆన్ చేయడానికి లేదా ఆరబెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు అస్సలు తొందరపడకూడదు. లేకపోతే మీరు చేసే ఒక చిన్న పొరపాటు ఫోన్‌ను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. అదే సమయంలో, మీ పరికరంలోకి వర్షపు నీరు చేరితే, ఈ 5 తప్పులను అస్సలు చేయకండి.

ఫోన్ ఆన్ చేయవద్దు:
వర్షంలో నానితే ముందుగా చెక్ చేయడానికి ఫోన్ ను ఆన్ చేస్తారు. కానీ ఇలా అసలు చేయవద్దు. ఇలా వెంటనే ఫోన్‌ను ఆన్ చేయడం పెద్ద తప్పు. దీని వల్ల ఫోన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఫోన్ పాడైపోవచ్చు. కాబట్టి, ఫోన్ తడిసిపోయినప్పుడల్లా, వెంటనే దాన్ని ఆన్ చేయడానికి తొందరపడకండి.

ఛార్జింగ్ పెట్టవద్దు
వర్షంలో ఫోన్ తడిసిన తర్వాత, కొంతమంది వెంటనే పరికరాన్ని ఛార్జింగ్‌లో పెడతారు. తద్వారా అది త్వరగా పనిచేస్తుందని నమ్ముతారు. కానీ ఇది ప్రమాదం నుంచి విముక్తి పొందదు. ఛార్జింగ్ చేస్తున్నప్పుడు నీరు, కరెంట్ తాకడం వలన ఫోన్, ఛార్జర్ రెండింటిలోనూ షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు. ఇది మీ ఖరీదైన ఫోన్‌ను దెబ్బతీస్తుంది. కాబట్టి, అలాంటి తప్పు అస్సలు చేయకండి.

హెయిర్ డ్రైయర్ లేదా హీటర్
వర్షంలో ఫోన్ తడిసిన తర్వాత, కొంతమంది దానిని హెయిర్ డ్రైయర్ లేదా హీటర్‌తో ఆరబెట్టడం ప్రారంభిస్తారు. కానీ మీరు ఇలా అస్సలు చేయకూడదు. హెయిర్ డ్రైయర్లు, హీటర్ల నుంచి వచ్చే వేడి ఫోన్ అంతర్గత భాగాలను దెబ్బతీస్తుంది. దీని వలన సున్నితమైన భాగాలు కరిగిపోవచ్చు. స్క్రీన్, బ్యాటరీ కూడా దెబ్బతినవచ్చు. కాబట్టి, అలాంటి తప్పు అస్సలు చేయకండి.

ఫోన్ షేక్:
ఫోన్ తడిసిన తర్వాత, ఫోన్‌ను షేక్ చేయడం వల్ల నీరు తొలగిపోతుందని కొందరు అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల నీరు ఫోన్‌లోని ఇతర భాగాలకు చేరుతుంది. అంతేకాకుండా స్పీకర్, మైక్రోఫోన్, పరికరం ఛార్జింగ్ పోర్ట్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి, మీరు దీన్ని అస్సలు చేయకూడదు.

బియ్యం పోయాలి:
చాలా మంది ఫోన్ వర్షంలో తడిస్తే బియ్యంలో పెట్టాలని అనుకుంటారు. ఇలా చేస్తే ఫోన్ త్వరగా ఆరిపోతుంది అనుకుంటారు. కానీ దీనివల్ల ఫోన్‌లోని తేమ పూర్తిగా తొలగిపోదు. కొన్నిసార్లు, బియ్యం ఛార్జింగ్ పోర్టులో కూడా ఇరుక్కుపోతాయి. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా ఇలా చేయవద్దని సలహా ఇస్తున్నాయి.

Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని oktelugunews.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
rain forecast for AP

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper