spot_img
Homeలైఫ్ స్టైల్homeo$exual : ఇద్దరు యువతుల సహజీవనం.. మరో మగాడు ఎంట్రీతో భారీ ట్విస్ట్

homeo$exual : ఇద్దరు యువతుల సహజీవనం.. మరో మగాడు ఎంట్రీతో భారీ ట్విస్ట్

Homeo$exual : ఇద్దరు యువతుల మధ్య స్నేహం కుదిరి సహజీవనం వరకు వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య చనువు ఎక్కువైంది. ఒకే గదిలో ఉంటూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమతో ఒకటిగా జీవనం సాగిస్తున్నారు. దీంతో స్నేహితురాలు మరొకరితో చనువుగా ఉంటుందనే అక్కసుతో మిత్రురాలును హతం చేసింది. సినిమా కథనంలా మారిన ఈ ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తనతో కలిసి ఉన్న స్నేహితురాలు వేరొకరితో ప్రేమతో ఉంటుందనే కారణంగా ఆమెను హత్య చేసింది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టుకు చెందిన సల్లూరి అంజలి (21) నెన్నెల మండలం మన్నెగూడెంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పెరుగు మహేశ్వరి అలియాస్ మహేశ్ తో పరిచయం ఏర్పడింది. రెండేళ్ల కిందట మంచిర్యాలలో ఓ గది అద్దెకు తీసుకుని మహేశ్వరి, ఆమె చెల్లెలు పరమేశ్వరి, సోదరుడు విఘ్నేష్ తో పాటు అంజలి కలి సి ఉంటున్నారు. మహేశ్వరి ఓ కళ్లద్దాల దుకాణంలో పనిచేస్తోంది.

ఈ నేపథ్యంలో మహేశ్వరికి అంజలికి మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏర్పడింది. అంజలికి ఇటీవల ఓ కన్సెల్టెన్సీ నిర్వహించే శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడి వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో మహేశ్వరిని దూరం పెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్వరిలో ప్రతీకార జ్వాల రగిలింది. అంజలిని ఎలాగైనా అంతం చేయాలని పథకం రచించింది. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి గదికి వెళ్లి అంజలిని తీసుకుని మామిడిగట్టుకు వెళ్దామంటూ తీసుకెళ్లింది. రాత్రి 11.30 ప్రాంతంలో శ్రీనివాస్ కు ఫోన్ చేసి అంజలి ఆత్మహత్య చేసుకుందని తాను కూడా చేసుకుంటున్నానని చెప్పింది.

దీంతో శ్రీనివాస్ పరమేశ్వరితో కలిసి కారులో గుడిపల్లి గ్రామ శివారులోకి చేరుకున్నారు. అక్కడ అపస్మారక స్థితిలో ఉన్న అంజలి, మహేశ్వరిని ఆస్పత్రికి తరలించారు. అంజలి అప్పటికే మరణించగా మహేశ్వరికి చికిత్స అందిస్తున్నారు. అంజలి మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మహేశ్వరి, శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకున్నారు. కేసును విచారిస్తున్నారు. మహేశ్వరి అంజలిని హత్య చేసిందని తెలుస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
Oktelugu Epaper