Fixed Deposit Tips: భారతదేశంలో ఆస్తుల పంపకాలపై పంపకాలపై ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. కొందరు తమకోసం.. తమ వారసుల కోసం డబ్బును కూడా పెడుతూ ఉంటారు. మరికొందరు ఫిక్స్డ్ డిపాజిట్ (FD) చేస్తుంటారు. అయితే వీరు జీవించినంత కాలం ఇది వారికే చెందుతుంది. లేదా వారి సూచనతో ఇతరులకు చెందిన అవకాశం ఉంటుంది. కానీ వీరి మరణాంతరం ఈ FD తమ కుమారులు లేదా మనువళ్ళకు చెందుతుందా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీనికి ఎలాంటి చట్టాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
తాత, నానమ్మల మరణానంతరం వారి ఫిక్స్డ్ డిపాజిట్ (FD) డబ్బు మనవళ్లకు వస్తుంది. కానీ అది కొన్ని షరతులపై ఆధారపడి ఉంటుంది. హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం.. తల్లిదండ్రులు (కుమారులు/కుమార్తెలు) లేని పక్షంలో మనవళ్లు మొదటి తరగతి వారసులుగా పరిగణించబడతారు. భారతదేశంలో హిందువులకు హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ద్వారా ఆస్తి పంపిణీ చేస్తారు. ఈ చట్టం ప్రకారం.. మొదటి తరగతి వారసులు – భార్య/భర్త, కుమారులు, కుమార్తెలు, తాత/నానమ్మల కుమారుడు/కుమార్తె ముందుగా మరణిస్తే వారి వాటా నేరుగా మనవళ్లకు చేరుతుంది.
నామినీ ఉన్నప్పుడు ఏమవుతుంది?
FDలో నామినీ ఉంటే.. బ్యాంకు మొదట ఆ నామినీకి డబ్బు ఇస్తుంది. కానీ నామినీ కేవలం ట్రస్టీ మాత్రమే. చట్టపరమైన వారసులకు (మనవళ్లు సహా) సరిగ్గా పంపిణీ చేయాలి. నామినీ నిరాకరిస్తే. మనవళ్లు కోర్టు ద్వారా హక్కు సాధించుకోవచ్చు. నామినీ లేకపోతే, చట్టపరమైన వారసులు (లీగల్ హెయిర్స్) క్లెయిమ్ చేయాలి. తహసీల్దార్ దగ్గర లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అందులో మనవళ్ల పేర్లు ఉంటాయి.
క్లెయిమ్ చేసే పత్రాలు
మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికేట్).
లీగల్ హెయిర్ సర్టిఫికేట్.
అన్ని వారసుల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC).
సక్సెషన్ సర్టిఫికేట్ (వివాదం ఉంటే, కోర్టు నుంచి).
ఈ పత్రాలతో బ్యాంకుకు దరఖాస్తు చేస్తే, FD మొత్తం + వడ్డీ వారసులకు పంపిణీ అవుతుంది.
గొడవలు రాకుండా తాత/నానమ్మలు జీవించి ఉన్నప్పుడే సరైన నామినీలు చేయాలి లేదా వీలునామా (విల్) రాయాలి. బ్యాంకులు RBI నియమాల ప్రకారం పనిచేస్తాయి. కాబట్టి పూర్తి పత్రాలు సిద్ధం చేసుకోవాలి.