Homeలైఫ్ స్టైల్Bathing : స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?

Bathing : స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?

Bathing : ఉదయం లేచిన తర్వాత ఫ్రెష్ అవడం కామన్. కొందరు రెండు మూడు రోజులు అయినా సరే స్నానం చేయరు. అలాంటి వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రోజు స్నానం చేసే వారు ఎక్కువ మందే ఉంటారు. అయితే ఇలాంటి వారు రెగ్యూలర్ గా కొన్ని తప్పులు కూడా చేస్తారు. అందులో మరీ ముఖ్యంగా మహిళలు కొన్ని తప్పులు చేస్తారు. కానీ స్నానం చేసే సమయంలో కూడా జాగ్రత్త చాలా అవసరం అంటున్నారు నిపుణులు. అయితే అందరూ చేసినట్టే మహిళలు కూడా స్నానం చేసేటప్పుడు కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు. దీంతో చర్మం దెబ్బతింటుంది. అంతేకాదు వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి, ఈ చిన్న తప్పులు చేయకుండా ఉండాలి. మీ చర్మం దెబ్బతినకుండా కాపాడుకోవడానికి స్నానం చేసేటప్పుడు ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read : ఫారెస్ట్ బాతింగ్.. ఇప్పుడు ఇదే ట్రెండింగ్.. దీనివల్ల లాభాలు ఏంటంటే..

చాలా వేడి నీటితో స్నానం
చాలా వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం సహజ తేమ తొలగిపోతుంది. దీనివల్ల చర్మం దురద, పొడిబారుతుంది. దీనితో పాటు, చర్మంపై అకాల ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి. అందువల్ల, ఎక్కువగా వేడి ఉన్న నీటితో స్నానం చేయడం మానుకోండి.

తరచుగా సబ్బు వాడటం: అధికంగా సబ్బు వాడటం వల్ల చర్మంలోని సహజ నూనెలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం పొడిబారి, సున్నితంగా మారుతుంది. కాబట్టి, ఎక్కువ సబ్బు వాడకండి. దీనితో మీరు మీ చర్మాన్ని చాలా వరకు కాపాడుకోవచ్చు.

తడి జుట్టును దువ్వడం: తడి జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది. దువ్వినప్పుడు మరింత విరిగిపోవచ్చు. కాబట్టి, తడి జుట్టును ఎప్పుడూ దువ్వకండి. దీనివల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. కాబట్టి, తడి జుట్టును ఎప్పుడూ దువ్వకండి.

మురికి లేదా తడి తువ్వాళ్ల: మురికి లేదా తడి టవల్ వాడటం వల్ల బ్యాక్టీరియా బారిన పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే అలాంటి తువ్వాళ్లలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది చర్మంపై ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

సన్నిహిత ప్రాంతం శుభ్రం: ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసే సమయంలో కూడా జాగ్రత్త అవసరం. ఈ ప్రాంతం చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దానిని తప్పుగా శుభ్రం చేయడం వలన సమతుల్యత దెబ్బతింటుంది. దీని కారణంగా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) లేదా ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.

రోజూ జుట్టు కడగడం: కొంతమంది మహిళలు రోజూ జుట్టుకు షాంపూ రాసుకుంటారు. దీనివల్ల వారి జుట్టు చాలా పొడిగా మారుతుంది. అదే సమయంలో, జుట్టు సహజ మెరుపు తగ్గడం ప్రారంభమవుతుంది. అయితే మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు తలస్నానం చేయడం మానుకొని వారానికి రెండు నుంచి మూడు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది.

Also Read : స్నానం చేసిన తరువాత ఏ పనులు చేయకూడదో తెలుసా?

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular