
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఛార్జ్ షీట్ ఆధారంగా రేవంత్ రెడ్డిపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రేవంత్ తో పాటు టీడీపీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్టారెడ్డి పై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. స్టీఫెన్ సన్ కు రూ. 50 లక్షలు ఇస్తుండగా రేవంత్ రెడ్డి పట్టుపడ్డ విషయం తెలిసిందే. 2015 మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసే విధంగా స్టీఫెన్ సన్ తో రేవంత్ రాయబారం సాగించాడు. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టేఫెన్ సన్ ను ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ అభియోగం.