Viveka murder case: సునీల్ యాదవ్ రిమాండ్ పొడిగింపు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ రిమాండ్ గడువును న్యాయస్థానం పొడిగించింది. రిమాండ్ ను సెప్టెంబరు 1 వరకు పొడిగిస్తూ జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. సునీల్ యాదవ్ కు నార్కో పరీక్షలకు అనుమతివ్వాలని సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నార్కో పరీక్షల పిటిషన్ పై జమ్మలమడుగు కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం విచారణను ఈ నెల 27కు కోర్టు వాయిదా వేసింది. పులివెందుల మేజిస్ట్రేట్ సెలవులో […]

Written By: Suresh, Updated On : August 18, 2021 5:14 pm
Follow us on

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ రిమాండ్ గడువును న్యాయస్థానం పొడిగించింది. రిమాండ్ ను సెప్టెంబరు 1 వరకు పొడిగిస్తూ జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. సునీల్ యాదవ్ కు నార్కో పరీక్షలకు అనుమతివ్వాలని సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నార్కో పరీక్షల పిటిషన్ పై జమ్మలమడుగు కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం విచారణను ఈ నెల 27కు కోర్టు వాయిదా వేసింది. పులివెందుల మేజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో జమ్మలమడుగు కోర్టులో వాదనలు జరిగాయి.