ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్, స్టార్ ఓపెనర్ రాహుల్ దుమ్మురేపారు. తాజాగా ఇంగ్లాండ్ తో ముగిసిన రెండో టెస్ట్ లో 8 వికెట్లతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చిన సిరాజ్ 465 రేటింగ్ పాయింట్స్ తో ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు రాహుల్ 19 స్థానాలు మెరుగుపరుచుకుని 37వ ర్యాంక్ ను ఎగబాకాడు. వరుసగా రెండు టెస్ట్ ల్లో విఫలమైనా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రోహిత్ ఆరో స్థానంలో ఉన్నాడు.