Homeఆంధ్రప్రదేశ్‌RK comments on YSR : పోయినోళ్లందరూ మంచోళ్లు.. వైఎస్ మహానేత.. ఆర్కే ఇంత మాట...

RK comments on YSR : పోయినోళ్లందరూ మంచోళ్లు.. వైఎస్ మహానేత.. ఆర్కే ఇంత మాట అనేశాడేంటి..

RK comments on YSR : తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడి మీద ఈగ వాలితే ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణ సహించడు. పైగా ఉల్టా కౌంటర్ ఇవ్వడంలో రాధాక్రిష్ణ ముందు వరసలో ఉంటాడు.  పైగా లాజిక్ లను పక్కన పెట్టి వన్ సైడ్ రాసేస్తుంటాడు. మిగతా మీడియా సంస్థలు ఎలాగున్నా..రాధాక్రిష్ణ  మాత్రం తన సంస్థల ద్వారా కౌంటర్ సాలిడ్ గా ఇచ్చేస్తూ ఉంటాడు. అందుకే టీడీపీ నేతలు ఆంధ్రజ్యోతిని తమ సొంత పత్రికగా పేర్కొంటారు. తాజాకొత్త పలుకులో రాధాక్రిష్ణ దారి తప్పాడు. చంద్రబాబు కు సపోర్ట్ చేసే క్రమంలో వైఎస్ కుటుంబం గురించి, రాజారెడ్డి గురించి అసలు విషయం బయటపెట్టేశాడు. దీంతో టీడీపీ నేతలకు ఇబ్బంది కరమైన పరిస్థితి ఏర్పడుతోంది.
జగన్ ఇటీవల ప్రెస్ మీట్ లో తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు. వారి మరణాల గురించి ప్రస్తావించారు. తన తండ్రి మరణం మీద అనుమానాలు ఉన్నాయని, తన తాత రాజారెడ్డిని పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. పనిలో పనిగా వాటి వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నట్టుగా ఆరోపించారు.
జగన్ అలా మాట్లాడడమే ఆలస్యం.. తెర పైకి టిడిపి నాయకులు వచ్చారు. ఇంత జరిగిన తర్వాత ఆంధ్రజ్యోతి రంగంలోకి దిగింది. గతంలో రాజారెడ్డి కుటుంబం ద్వారా ఇబ్బంది పడిన పులివెందులకు చెందిన పార్థసారథి రెడ్డితో ఏబీఎన్ డిబేట్ నిర్వహించింది. ఆ డిబేట్ లో జగన్ కుటుంబం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు పార్థసారథిరెడ్డి. ఇది పూర్తయిన తర్వాత రాధాక్రిష్ణ రంగంలోకి దిగాడు.
ఆదివారం కొత్త పలుకులో మరింత రెచ్చిపోయాడు. టిడిపి నాయకులకు చేతకానిది.. చంద్రబాబు చెప్పలేనిది.. లోకేష్ కు తెలియనిది బయట పెట్టేశాడు. అయితే ఈ ఊపులో రాధాకృష్ణ కాస్త రాంగ్ స్టెప్ వేశాడు. అది కాస్త జగన్మోహన్ రెడ్డి క్యాంపుకు అనుకూలంగా.. టిడిపికి వ్యతిరేకంగా మారిపోయింది.
“పోయిన వాళ్ళందరూ మంచివాళ్లు అనుకునే సమాజం మనది. వైయస్ రాజశేఖర్ రెడ్డి వల్ల రాజారెడ్డి మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఆయన మహానేతగా పేరు తెచ్చుకున్నారు. రాజారెడ్డి హత్య రాజకీయాల వైపు వెళ్లిన తర్వాత వారి కుటుంబానికి ఆస్తులు వచ్చాయి. రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డికి పెద్దగా ఆస్తులు ఉండేవి కాదు. ఆయన ఒక చిన్నపాటి రైతు. వైయస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ విన్యాసాలు చేశారు. అనేక రకాలుగా ఆస్తులు సంపాదించుకున్నారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు సంపాదించని తీరుగా ఆస్తులను పెంచుకున్నాడు. పేర్ల పార్థసారధి రెడ్డి చెప్పినట్టుగానే రాజారెడ్డి కుటుంబం నెత్తుటి కూడు తిరిగి పెరిగింది. నాటి శాపాలు ఇప్పుడు వైయస్ కుటుంబాన్ని వేధిస్తున్నాయి. రాజారెడ్డిని హత్య ఎవరు చేశారో తెలియదు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన వైఎస్ ను మహానేతగా భావిస్తున్నారు..”
ఇలా రాసుకుంటూ పోయాడు రాధాకృష్ణ. పనిలో పనిగా జగన్ తన కుమారుడి మీద.. తన కుమార్తె మీద చేసిన ఆరోపణలకు రాధాక్రిష్ణ కౌంటర్ ఇచ్చాడు. ఒకవేళ తనకి ఇదంతా తెలిసి ఉంటే కోర్ క్యాపిటల్ సమీపంలోనే భూములు కొనేవాడినని రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ వ్యాసంలో రాధాకృష్ణ చేసిన అతి తప్పు రాజశేఖర్ రెడ్డిని సమర్థిస్తూ మహానేత అనడం.. వైసీపీ నేతలు రాధాకృష్ణ వ్యాఖ్యలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. చూశారా మీ రాధాకృష్ణనే వైయస్ రాజశేఖర్ రెడ్డిని మహానేత అంటున్నారు.. ఇప్పుడేం సమాధానం చెబుతారు అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పుకోలేక టిడిపి నేతలు ఇబ్బంది పడుతున్నారు.
రాధాకృష్ణ వల్ల టిడిపి నాయకులకు లాభం ఎంత జరుగుతుందో తెలియదు కాని.. అప్పుడప్పుడూ ఇలాంటి నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మిగతా వ్యాసం అంటారా తనకు నచ్చిన టాపిక్ కాబట్టి.. తనకు తెలిసిన విషయాలు కాబట్టి.. రాధాకృష్ణ చెలరేగిపోయాడు. కానీ ఇదే సాక్షి రాజారెడ్డి మరణం మీద తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో ఒక వ్యాసం రాసింది. అది ఎలా ఉందంటే ఆయనను ఒక గాంధీ మహాత్ముడి లాగా చిత్రీకరించింది. పాపం సాక్షి.. ఏదైనా రాస్తే చదివేలా ఉండాలి.. ముఖం మీద ఉమ్మెలా ఉండకూడదు.
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version