AIADMK MLAs revolt : అనుకున్నట్టే జరిగింది. తమిళనాట అన్నాడీఎంకే చీలుతుందని అంతకుముందే చెప్పుకున్నాం అదే జరిగింది.. ఎన్నికలకు ముందు ఈ ఫళని స్వామికి తిరుగులేదని అనుకున్నారు. 234 సీట్లలో రెండు సార్లు ఫళని స్వామి చుట్టేశారు. ఎన్నికల్లో తన సొంత జిల్లా సేలంలో 11 సీట్లకు 7 సీట్లను ఫళని స్వామి గెలుచుకున్నారు. తన సొంత నియోజకవర్గంలో మెజార్టీ లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. మొత్తం కలిపి సీట్లు 47 మాత్రమే వచ్చాయి. వీరికి బలమైన బెల్ట్ అనుకున్న కొంగ్డు బెల్ట్ లోనూ దెబ్బ తిన్నది. కోయంబత్తూరులో 10కి ఒక్కటే వచ్చింది.
కోయం బత్తూరు , తిరుప్పూర్, ఈరోడ్, నీలగిరిలలో 29కి కేవలం 7 సీట్లు వచ్చాయి. పోయినసారి కంటే తగ్గింది.ఎన్నికలయ్యాక జరిగిన నాటకీయ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి.107 సీట్లు వచ్చిన విజయ్ ను పక్కనపెట్టి..70 సీట్లు వచ్చిన డీఎంకేను కాదని.. 47 సీట్లు వచ్చిన ఫళని స్వామి ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నాలు చేశారు. ఎవరు దీని వెనుక అంటే..
డీఎంకే.. ఉదయనిధి స్టాలిన్ ఏకంగా విజయ్ సీఎం కావద్దని.. ఫళని స్వామి, ఉదయనిధి స్టాలిన్ లు కలిసి రెండూ కలిపి అధికారం సాధించాలని.. పొత్తు పెట్టుకోవాలని స్కెచ్ గీశాయి. డీఎంకే ప్రపోజల్ ఏంటంటే? రెండు సీట్లు గెలిచిన వీసీకే అధినేత తిరుమళపల్వన్ ను సీఎం చేయాలని స్టాలిన్ డిసైడ్ చేయగా.. తానే సీఎం అవుతానని ఫళని స్వామి పట్టుబట్టాడు. తిరుమల పల్వన్ ను డిప్యూటీ సీఎం చేస్తానని ఫళనిస్వామి భీష్మించుకు కూర్చున్నారు. అది చర్చలు బ్రేక్ అయ్యాయి. ఆ తరవాత వీసీకే టీవీకే విజయ్ కు సపోర్టు చేయడం జరిగింది. ఇది అన్నాడీఎంకేలో సంచలనమైంది. డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని చూసిన అన్నాడీఎంకే నేతలు భగ్గుమని ఫళనిస్వామికి వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. 47 మంది లో 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు షణ్ముగం ఆధ్వర్యంలో ఫళనిస్వామి తిరుగుబాటు చేశారు.
పళనిస్వామికి వ్యతిరేకంగా మెజారిటీ AIADMK MLAలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.