తాలిబన్ల దాడిలో ఇండియన్ జర్నలిస్ట్ మృతి

ఇండియన్ ఫొటో జర్నలిస్ట్, పులిట్టర్ అవార్డు విజేత డానిష్ సిద్దికీ ఆఫ్ఘనిస్థాన్ లో మృతి చెందారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్ టర్స్ కు పనిచేస్తున్న ఆయన గురువారం రాత్రి కాందహార్ లో జరిగిన తాలిబన్ల దాడిలో మరణించారు. ఆఫ్ఘన్ స్పషల్ ఫోర్సెస్ వెంట ఉంటూ అక్కడి పరిస్థితి పై ఆయన రిపోర్ట్ చేస్తున్నారు. స్పిస్ బోల్డక్ లోని ప్రధాన మార్కెట్ ప్రాంతాన్ని ఆఫ్ఘన్ ప్రత్యేక దళాలు తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తాలిబన్లు ఫైరింగ్ […]

Written By: Suresh, Updated On : July 16, 2021 2:48 pm
Follow us on

ఇండియన్ ఫొటో జర్నలిస్ట్, పులిట్టర్ అవార్డు విజేత డానిష్ సిద్దికీ ఆఫ్ఘనిస్థాన్ లో మృతి చెందారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్ టర్స్ కు పనిచేస్తున్న ఆయన గురువారం రాత్రి కాందహార్ లో జరిగిన తాలిబన్ల దాడిలో మరణించారు. ఆఫ్ఘన్ స్పషల్ ఫోర్సెస్ వెంట ఉంటూ అక్కడి పరిస్థితి పై ఆయన రిపోర్ట్ చేస్తున్నారు. స్పిస్ బోల్డక్ లోని ప్రధాన మార్కెట్ ప్రాంతాన్ని ఆఫ్ఘన్ ప్రత్యేక దళాలు తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తాలిబన్లు ఫైరింగ్ జరిపారు. ఇందులో సిద్దిఖీతో పాటు ఓ సీనియర్ ఆఫ్ఘన్ ఆఫీసర్ కూడా మృతిచెందారు.