పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ప్రజాప్రతినిధుల కోర్టు 6 నెలల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లు అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ లో 2018 లో కేసు నమోదైంది. అభియోగం రుజువు కావడంతో న్యాయస్థానం ఇవాళ తీర్పు వెల్లడించింది. దీంతో పాయం వెంకటేశ్వర్లు రూ. 10 వేల జరిమానా చెల్లించారు. అప్పీలు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతిస్తూ జైలు శిక్ష నిలిపివేసింది.