ఐదో రోజు భోజన విరామ సమయానికి భారత్ 286/8 స్కోర్ తో మెరుగైన స్థితిలో నిలిచింది. బుమ్రా (30), షమి (52) ఎనిమిదో వికెట్ కు 77 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి నాటౌట్ నిలిచారు. అంతకుముందు 181/6 ఓవర్ నైట్ స్కోర్ తో సమవారం ఆట కొనసాగించిన టీమ్ ఇండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పంత్ (22) నిరాశపరిచాడు. తర్వాత ఇషాంత్ (8) ఔటయ్యాడు. ఆపై జోడీ కట్టిన బుమ్రా, షమి ఎనిమిదో వికెట్ కు రికార్డు భాగస్వామ్యం జోడించారు.