తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఆ డిమాండ్ ను అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలని ఆ పార్టీ సీనియర్ నేత పూసపాటి ఆశోక్ గజపతి రాజు పిలుపునిచ్చారు. తెదేపా మహానాడు రెండోరోజు ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. రాజకీయరంగంలో ఎన్టీఆర్ అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. పేదల వద్దకు సంక్షేమాన్ని తీసుకొచ్చిన నేత ఎన్టీఆర్ అని అశోక్ గజపతి కొనియాడారు.