spot_img
Homeవార్త విశ్లేషణViral Video : అర్ధరాత్రి మెడలో పుర్రెలు వేసుకొని శశ్మానంలో లేడి అఘోరి చేసిన పని.....

Viral Video : అర్ధరాత్రి మెడలో పుర్రెలు వేసుకొని శశ్మానంలో లేడి అఘోరి చేసిన పని.. వైరల్ వీడియో

Viral Video :  తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలానికి చెందిన ఓ మహిళ 20 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. చిన్నప్పుడు వెళ్లిపోయిన ఆమె ఇప్పుడు అఘోరి అవతారంలో హైదరాబాద్‌లో దసరా పండుగ తర్వాత ప్రత్యక్షమైంది. స్థానిక ఆలయాల సమీపంలో పుర్రెల బొమ్మలతో ఉన్న ఓ కారు కనిపిస్తుండడంతో అందరూ ఆసక్తిగా చూశారు. కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్ల ప్రతినిధులు దానినిఫాలో చేశారు. ఈ క్రమంలో అందులో మహిళా అఘోరి పర్యటిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అఘోరితో మాట్లాడారు. ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఎలా మారారు.. ఎందుకు మారారు.. ఎలాంటి ఆహారం తీసుకుంటారు. ఐఫోన్‌ వాడడం, కారు నడపడం ఏంటి అని ఇలా అనేక సమాచారం రాబట్టారు. అయితే అఘోరి కొన్ని సందర్భాల్లో హల్‌చల్‌ చేయడంతో పోలీసులు పట్టుకుని అక్కడి నుంచి పంపిచి వేస్తున్నారు. కార్తిక పౌర్ణమి రోజు శ్రీశైలంలో ఈ మహిళా అఘోరి హల్‌చల్‌ చేసింది. నవంబర్‌ 18న హైదరాబాద్‌ విజయవాడ జాతీయ రహదారిపై హల్‌చల్‌ చేసింది. తనను ఫొటోలు, వీడియోలు తీయడానికి వచ్చిన స్థానికులపై త్రిశూలంతో దాడిచేసేందుకు యత్నించింది. దీంతో పోలీసులు కష్టంగా అమెను అక్కడి నుంచి పంపించివేశారు.

వరంగల్‌లో న్యూసెన్స్‌..
సాధారణంగా అఘోరీలు ఎక్కువగా జనాల్లో కనిపించరు. ఈ మహిళా అఘోరి మాత్రం నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తోంది. న్యూసెన్స్‌ చేస్తోంది. కుంభ మేళాలు.. పుష్కరాల సమయంలో మాత్రమే అఘోరాలు కనిపిస్తారు. తర్వాత మిమాలయాల్లోనే ఎక్కువగా గడుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన అఘోరి మాత్రం తాంత్రిక పూజలతో జనాలను భయపెడుతోంది. రోడ్లపై ఆమె చేష్టలకు పోలీసులకు చికాకు తెప్పిస్తున్నాయి. రెండు రోజుల క్రితం గుంటూరు వెళ్లిన అఘోరి.. మళ్లీ తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో ప్రత్యక్షమైంది.

శ్మశానంలో పూజలు..
సినిమాల్లో తరహాలో అఘోరి వరంగల్‌ జిల్లాలోని ఓ శ్మశానంలో మంగళవారం(నవంబర్‌ 19న) రాత్రి పూజలు చేసింది. శవాన్ని కాల్చిన బూడిదలో కూర్చుని చుట్టూ త్రిశూలాలు నాటుకుని.. పూజలు చేయడాన్ని చూసి స్థానికులు ఆందోళన చెందారు. మొదట పద్మాక్షి ఆలయం మీదుగా వరంగల్‌ శివారులోని బెస్తన్‌ చెరువు సమీపంలోని శ్మశాన వాటికకు చేరుకుంది. మొదట శవాన్ని కాల్చే ప్రదేశంలో కాసేపు పడుకుంది. శవాన్ని దహనం చేసిన బూడిదను తన ఒంటికి రాసుకుని హంగామా చేసింది. అంతటితో ఆగకుండా హర్రర్‌ సినిమాలో తరహాలో తాంత్రిక పూజలు చేసింది. తన వెంట తెచ్చుకున్న కోడిని బలి ఇచ్చి రక్త తర్పణం చేసింది. గుమ్మడికాయ కోసి గంటకుపైగా పూజలు చేసింది.

ఆందోళనలో స్థానికులు..
శ్మశానంలో అఘోరి చేసిన పూజలను చూసిన స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అసలు అక్కడ ఎందుకు పూజలు చేసింది.. ఏం జరగబోతుంది అని చర్చించుకుంటున్నారు. ఇక పూజల సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను పంపించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper