mysoor maharani
కరోనా వైరస్ పేరు చెబితే ప్రస్తుతం యావత్ ప్రపంచం బెంబెలేత్తిపోతుంది. దీంతో ఈ మహమ్మరికి వాక్సీన్ కనుగొనేందుకు సైంటిస్టుల రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇప్పటికే రష్యా నుంచి కరోనా వ్యాక్సిన్ వచ్చినా దీనిపై పెద్దగా నమ్మకం లేదు. దీంతో పలుదేశాలు మరిన్ని ట్రయల్స్ చేసి మెరుగైన వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారతదేశం ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీ ఖర్కానాగా పేరుగాంచింది. దీంతో యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.
Also Read: బిడెన్ గెలిస్తే.. చైనా గెలిచినట్లేనట.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అయితే ప్రపంచంలోని తొలి వ్యాక్సిన్(టీకా)కు ప్రచారం కల్పించింది మన భారతీయు మహారాణులే అని చాలామందికి తెలియదు. 18వ శతాబ్ధంలో భయాంకరమైన మశూచి వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధితో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో అప్పటికే బ్రిటిష్ కంపెనీకి చెందిన కంపెనీలు స్థిరపడటంతో పాలనను చేపట్టాయి. ఆ సమయంలోనే బ్రిటిష్ చెందిన సైంటిస్టులు మశూచికి టీకాను కనుగొన్నారు. భారత్ లోనూ మశూచి ప్రబలడంతో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. భారతీయులతోపాటు బ్రిటీష్ వారిని కాపాడేందుకు టీకాను బ్రిటన్ దేశం నుంచి ఓడరేవుల్లో ఎంతో కష్టపడి తీసుకొచ్చారు.
Also Read: వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?