spot_img
Homeఅంతర్జాతీయంYogi vs Akhilesh: యోగి వర్సెస్ అఖిలేష్.. యూపీలో రసవత్తర రాజకీయాలు?

Yogi vs Akhilesh: యోగి వర్సెస్ అఖిలేష్.. యూపీలో రసవత్తర రాజకీయాలు?

Yogi vs Akhilesh: ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. త్వరలో జరిగే ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఎలాగైనా గెలుపొందాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా యూపీలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నాయి,. ఇదివరకే రెండు మార్లు అధికారం చేపట్టిన బీజేపీ మూడోసారి కూడా విజయం సాధించాలని చూస్తోంది. ఐదేళ్ల పాలనలో యోగిపై వస్తున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని ఎస్పీ ప్రయత్నిస్తోంది.

Yogi vs Akhilesh
Yogi vs Akhilesh

ధరల నియంత్రణలో వైఫల్యం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. అటు పెట్రోధరల పెరుగుదల భయపెట్టిస్తోంది. ఇటు గ్యాస్ ధరలు పెరగడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు లఖీంపూర్ ఘటన ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. అధికార పార్టీకి చెందిన మంత్రి కుమారుడే రైతులను చంపి పార్టీకి అపఖ్యాతి తీసుకొచ్చారు. దీంతో యూపీలో అధికారం చేపట్టడం అంత సులువు కాదని తెలుస్తోంది.

సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీని టార్గెట్ చేసుకుని అధికారం కోసం పోరు సాగిస్తున్నారు. ఎలాగైనా బీజేపీని అధికారానికి దూరం చేయాలని చూస్తున్నారు. దీనికి యోగి సర్కారు వైఫల్యాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కానీ బీఎస్పీ, కాంగ్రెస్ మాత్రం దూకుడు ప్రదర్శించలేకపోతున్నాయి. దీంతో అఖిలేష్ దూకుడు పెంచుతున్నారు. యోగి సర్కారును గద్దె దించాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: పండుగ పూట థియేటర్లపై ఏపీ సర్కారు దాడులు.. భద్రతా ప్రమాణాలపై తనిఖీలు..
ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు బీఎస్పీ వెంట ఉన్న దళితుల ఓటు బ్యాంకు చీలిపోతోంది. ఇప్పుడు ఎస్పీ వెంట వెళ్లేందుకు చూస్తున్నారు. కొందరు బీజేపీని కూడా ఆశ్రయిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కు కూడా కొందరు జై కొడుతున్నారు. బీఎస్పీ వెనుకబడటంతో రాజకీయం పూర్తిగా మారిపోతోంది. ఈ క్రమంలో యూపీలో ఎవరు పట్టు సాధిస్తారో కూడా అంతుబట్టడం లేదు. కొన్ని సర్వేలు బీఎస్పీని విస్మరిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో రాబోయే ఎన్నికల్లో యూపీలో అఖిలేష్ యాదవ్ బలపడితే ఎస్పీ వైపు ఓటర్లు మొగ్గు చూపుతారనే వాదన వినిపిస్తోంది. దీంతో యోగి ఆదిత్యనాథ్ కూడా ఎలాగైనా అధికారం దూరం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. రాజకీయంగా రసవత్తర పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: చినజీయర్ స్వామి ఆశ్రమ కార్యక్రమానికి కేసీఆర్ సర్కారు అత్యధిక ప్రాధాన్యత..!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper