ఆంధ్రప్రదేశ్‌ర‌ఘురామ కోసం.. వైసీపీ కొత్త అస్త్రం సిద్ధం?

ర‌ఘురామ కోసం.. వైసీపీ కొత్త అస్త్రం సిద్ధం?

Raghu rama Krishnam raju issue

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు న‌చ్చ‌ని పేరు ఏదైనా ఉందంటే.. అది ర‌ఘురామ‌కృష్ణరాజు. చంద్ర‌బాబు నాయుడు అనే పేరు కూడా సెకండ్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది. అంత‌లా ఇబ్బంది పెడుతున్నారు ర‌ఘురామ రాజు. అప్ప‌టి వ‌ర‌కూ మీడియా స్టేట్ మెంట్ల‌తో రాష్ట్రానికే ప‌రిమితమైన ర‌ఘురామరాజు వ్య‌వ‌హారం.. ఆయ‌న అరెస్టుతో ర‌చ్చ ర‌చ్చ‌గా మారి, దేశ‌వ్యాప్త‌మైపోయింది. బ‌ల‌వంతంగా అదుపు చేద్దామ‌ని భావిస్తే.. ప‌రిస్థితి రివ‌ర్స్ కొట్టింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. అయితే.. ఇప్ప‌టికీ కంట్లో న‌లుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న‌ను ఎలా దెబ్బ‌తీయాలా అని వైసీపీ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంద‌ని అంటున్నారు. ఇందుకోసం కొత్త అస్త్రం ఒక‌టి సిద్ధం చేసింద‌ని స‌మాచారం.

ఎంపీ ర‌ఘురామ ఆర్థిక మూలాల‌పై దెబ్బ కొట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ మిష‌న్ ను రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి తీసుకున్నార‌ని తెలుస్తోంది. ర‌ఘురామ‌కు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. ఇండ్ భార‌త్ పేరుతో కంపెనీలు ఉన్నాయి. ఇవ‌న్నీ నాటి సీఎం వైఎస్ హ‌యాంలోనే బ‌లంగా త‌యార‌వ‌డం గ‌మ‌నార్హం. వైఎస్ ఆత్మ‌గా చెప్పుకునే కేవీపీ రామ‌చంద్ర‌రావుకు ఆర్ ఆర్ ఆర్ వియ్యంకుడు. దీంతో.. ఆ విధంగా ర‌ఘురామ రాజు ఫుల్లుగా ఎదిగార‌ని చెబుతారు.

అంతేకాదు.. ర‌ఘురామ వ్యాపారాల్లో విజ‌య‌సాయి స‌ల‌హాలు, సూచ‌న‌లు కూడా ఉన్నాయ‌ని అంటారు. అప్పుడు మంచిగా మెలిగిన రోజుల్లో అలా సాగిపోయింది. ఆ విధంగా.. ర‌ఘురామ ఆర్థిక అంశాల‌కు సంబంధించిన అన్ని విష‌యాలూ విజ‌య‌సాయికి తెలుస‌ని కూడా అంటున్నారు. ఇటు చూస్తే.. ర‌ఘురామ సంస్థ‌లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని, వాటిని స‌రిగా చెల్లించ‌లేద‌ని ఏకంగా సీబీఐ కేసులు కూడా న‌మోద‌య్యాయి. కోర్టుల్లో కూడా కేసులు ఉన్నాయి. ఈ విష‌యాల‌న్నీ విజ‌య‌సాయికి తెలుసు.

ఇప్పుడు ఇదే అస్త్రంతో ర‌ఘురామ‌ను దెబ్బ‌తీసేందుకు ప్లాన్ గీస్తున్న‌ట్టు స‌మాచారం. ఒక‌వైపు.. న‌ర్సాపురం ఎంపీపై అన‌ర్హ‌త వేటు వేయించ‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌య‌త్నం అటు సాగిస్తూనే.. ఇటు ర‌ఘురామ ఆర్థిక మూలాల‌పైనా దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యాలను ప్ర‌ధానికి, రాష్ట్ర‌ప‌తి దృష్టికి తీసుకెళ్ల‌డం ద్వారా మ‌రింత ఒత్తిడి పెంచేందుకు చూస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రి, ఈ ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయ‌న్న‌ది చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

MP Vijayasai Reddy: విజయ్ సాయి.. హీరోల రెమ్యూనరేషన్లు నీకెందుకయ్యా?

ఏపీలో ఎన్నో సమస్యలు ఉండగా వాటన్నింటినీ మరిచి కేవలం సినిమాటోగ్రఫీ చట్టాన్ని మార్చాలని విజయ్ సాయి రెడ్డి డిమాండ్ చేశారు.

విజయసాయిరెడ్డి మాటల్లో ఆంతర్యమేమిటో?

పార్లమెంట్ ను స్తంభింపచేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. అది ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులపైనో నిధులపైనో కాదు. పార్లమెంట్ లో ప్రజాసమస్యలపై పోరాడిన దాఖలాలు లేవు. అయితే ప్రత్యేక హోదా కోసం అనుకుంటారేమో...

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Tammineni Sitaram

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...