Homeజాతీయ వార్తలుWest Bengal election battle: బెంగాల్‌ ఎన్నికల యుద్ధం.. పాలకులను నిర్ణయించేంది వారే!

West Bengal election battle: బెంగాల్‌ ఎన్నికల యుద్ధం.. పాలకులను నిర్ణయించేంది వారే!

West Bengal election battle: సరిగ్గా నెల రోజుల తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ నాలుగోసారి విజయం సాధించాలనిచూస్తోంది. బీజేపీ త్రణమూల్‌కు బ్రేక్‌ వేయాలని చూస్తోంది. బెంగాల్‌ రాజకీయాలను శాసించే కీలకమైన శక్తి ముస్లిం సమాజం. బెంగాల్‌ రాజకీయాలను ఏడు దశాబ్దాలుగా శాసిస్తున్నారు.

రెట్టింపైన ముస్లిం ఓట్లు..
పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం జనాభా 1951లో 19.6 శాతం ఉండేవారు. ప్రస్తుతం 33 శాతానికి పెరిగారు. అంటే దాదాపు రెంట్టింపు అయ్యారు. 85 స్థానాల్లో వీరే విజేతలను నిర్ణయిస్తారు, మరో 30–40 సీట్లలో ప్రభావం చూపుతారు. మొత్తం 120 నియోజకవర్గాల్లో వారి ఆధిపత్యం రాజకీయాలను శాసిస్తుంది.

ఆ జిల్లాల్లో ప్రభావం..
ముర్షీదాబాద్‌లో 46 శాతం, మాల్దాలో 51 శాతం, పశ్చిమ దినాజ్‌పూర్‌లో 50 శాతం, వీర్‌భూమిలో 50 శాతం, దక్షిణ 24 పర్గణాల్లో 30 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో 85 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులనే పార్టీలు బరిలో దింపుతాయి. వారే గెలుస్తారు. మరో 30 స్థానాల్లో ముస్లింల మద్దతుతో ఇతర మతాల అభ్యర్థులు గెలుస్తారు. ముస్లింలు ఓట్లు వేయకుంటే ఓడిపోతారు.

చారిత్రక ఓటు మార్పులు
దేశ విభజన తర్వాత కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్టుల వైపు ముస్లిం ఓట్లు మళ్లాయి. భూసంస్కరణలు, పాఠ్యపుస్తకాల మార్పులు, ఓబీసీలో 66 ముస్లిం కులాలు చేర్చడం ద్వారా వారిని బలోపేతం చేశారు. 2011 నుంచి తృణమూల్‌ వైపు మళ్లారు. ఇటీవల 36 ఉపకులాలను బీసీలో చేర్చి 35 ముస్లింలవి, ఉర్దూ రెండో అధికారిక భాషగా గుర్తింపు, ఇమామ్‌లకు వేతనాలు ప్రకటించింది. 2006లో కమ్యూనిస్టులు 102, 2021లో ఖీMఇ 95 సీట్లు ఈ ఓట్లతోనే గెలిచాయి.

ముస్లిం పార్టీల సవాల్‌..
ఎంఐఎం, ఐఎస్‌ఎఫ్‌ (ఇమామ్‌ అబ్బాస్‌), ఆల్‌ జనతా ఉనయన్‌ (మాజీ ఎంపీ ప్రారంభం) పార్టీలు ఈసారి అభ్యర్థులను పోటీలో దించాయి. ముస్లిం బలంగా ఉన్న ప్రాంతాల్లో వీటి ప్రభావం టీఎంసీ సీట్లను 20 వరకు తగ్గించే అవకాశం ఉంది.

ఈసారి ఎన్నికల్లో టీఎంసీకి బీజేపీ బ్రేక్‌ చేయాలని చూస్తోంది, ముస్లిం ఓట్ల చీలిక ఇందుకు దోహదపడే అవకాశం ఉంది. 20 మంది ముస్లింలు గెలిస్తే ఫలితాలు మారతాయి. ముస్లిం పార్టీల పోటీ ఓటు బ్యాంకును విభజించి, బెంగాల్‌ రాజకీయాల్లో కొత్త అధ్యాయం రాస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Ramayana Movie

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...
Haripriya Vasishta N Simha

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...
Quality Content In Cinema

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...
Adarsha Kutumbam

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...
Zomato Anniversary Campaign

Zomato Anniversary Campaign: బిల్డప్ కోసం లోగో తీసేస్తే.. కోట్లు బొక్క..

Zomato Anniversary Campaign: క్రియేటివిటీ.. ఇది ఆకర్షించే విధంగా ఉండాలి. జనాలలో ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. ఒకరకంగా నూతనత్వం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి. అలాకాకుండా చదివేస్తే ఉన్న...
Oktelugu Epaper