Homeఆంధ్రప్రదేశ్‌హీటెక్కిస్తున్న బెజవాడ పాలిటిక్స్‌.. : బాబుకు షాక్‌ ఇచ్చిన కేశినేని

హీటెక్కిస్తున్న బెజవాడ పాలిటిక్స్‌.. : బాబుకు షాక్‌ ఇచ్చిన కేశినేని

Kesineni
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ టీడీపీలో గ్రూప్ వార్ బయటపడింది. వన్ టౌన్ నాలుగు స్తంభాల సెంటర్‌‌లో డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన్ను ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయులు అడ్డుకున్నారు. కేశినేనితో వాగ్వాదానికి దిగారు. పార్టీ మారిన వాళ్లని టీడీపీలో ఎలా ప్రోత్సహిస్తారని ప్రశ్నించారు. కనీసం పార్టీ కండువా కూడా కప్పుకోలేదని.. అలాంటి వారి తరపున ఎలా ప్రచారం చేస్తారో చెప్పాలన్నారు. ఒకే చోట ఇద్దరు కార్పొరేటర్ అభ్యర్థులను ఎలా పెడతారని ప్రశ్నించారు.

Also Read: ఆ మంత్రి టార్గెట్‌ అయ్యాడా..! : అందుకే ఈ ఏసీబీ సోదాలా..?

టీడీపీ కార్యకర్తల్ని ఎంపీ నాని వారించే ప్రయత్నం చేశారు. తాను తప్పు చేస్తే పార్టీ క్రమ శిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను వైఎస్సార్‌సీపీ నుంచి తెచ్చుకున్నారని.. వాళ్లలో కొంతమంది గతంలో తిట్టినవారే కదా అన్నారు.. అది తప్పు కాదా అంటూ ప్రశ్నించారు. పార్టీలో ఎవరు తప్పు చేసినా వారిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయొచ్చని.. ఇలా నడి రోడ్డుపై అడ్డుకొని వాగ్వాదం చేస్తే పార్టీకే నష్టం అన్నారు.

ఇదిలా ఉంటే మేయర్ అభ్యర్థి విషయంలో టీడీపీలో వార్ మొదలైంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులతో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, సీనియర్ నేనేత నాగుల్‌మీరా సమావేశం అయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మేయర్‌ అభ్యర్థ విషయంలోనూ గందరగోళం కొనసాగుతోంది. చంద్రబాబు ఇంకా ఎవరి పేరు ఫైనల్ చేయలేదు.‌ గత కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థికి ఇచ్చారని.. ఈసారి సెంట్రల్ నియోజకవర్గానికి ఇవ్వాలని పట్టుబడుతున్నారట.

Also Read: టీఆర్‌‌ఎస్‌లో భయం మొదలైందా..? అందుకే ఆ స్థానానికి పోటీ చేయడం లేదా..?

మరోవైపు.. కేశినేని నాని కుమార్తె శ్వేత మేయర్ అభ్యర్థి అని ప్రచారం జరుగుతుండగా.. యాంటీ వర్గం ఇంకా ఎవరి పేరు డిక్లేర్ చేయలేదని అంటోంది. చంద్రబాబు ఎవరు మేయర్‌ అని చెబితే వారికే మద్దతిస్తామని టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు అంటున్నారు. ఇటు బుద్దా వెంకన్న వర్గం కూడా కేశినేని నానిపై అసహనంతో ఉంది. దీంతో విజయవాడ మేయర్ పంచాయతీ మొత్తం టీడీపీ అధినేత దగ్గరకు చేరనుంది. వైసీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు ఫిరాయింపులకు ప్రోత్సహించి టీడీపీలోకి తీసుకురావడం తప్పు కానప్పుడు ఇప్పుడు శివను తాను టీడీపీలోకి తీసుకురావటంలో తప్పేంటని గట్టిగానే ఎదురు తిరిగారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version