Homeజాతీయ వార్తలుVijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు ఒకరకంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి గట్టి ఎదురు దెబ్బ. చెంపపెట్టు లాంటి తీర్పు. వాస్తవానికి ఇలాంటి తీర్పు వస్తుందని.. న్యాయ విశ్లేషకులు ముందుగానే చెప్పారు. అయినప్పటికీ విజయ్ ప్రభుత్వం గుడ్డిగానే ముందుకు వెళ్ళింది. అంతేకాదు.. ఉద్యోగ నియామక పత్రాలు అందించుకుంటూ విజయ్ తమిళనాడు పోలీసుల మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏకంగా హైకోర్టు తప్పు పట్టడం.. ఉద్యోగ నియామకాలను రద్దు చేయడంతో విజయ్ కి నోటి వెంట మాట రాని పరిస్థితి.

విజయ్ పార్టీ పెట్టిన తొలి రోజుల్లో.. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. కరూర్ ప్రాంతంలో ఒక సభ నిర్వహించారు. నిర్వహణలోపం వల్ల తొక్కిసలాట చోటుచేసుకుంది. దాదాపు 41 మంది చనిపోయారు . నాడు చనిపోయిన వారి కుటుంబ సభ్యులను విజయ్ పరామర్శించారు. తాను అధికారంలోకి వస్తే పరిహారంతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని అన్నారు.

ఇటీవల కరూర్ ప్రాంతంలో నిర్వహించిన సభలో విజయ్ 32 కుటుంబాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. 10 లక్షల పరిహారం కూడా పంపిణీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ తర్వాత ఈ కేసును విచారించిన హైకోర్టు సోమవారం తుది తీర్పు వెల్లడించింది.. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందని.. పరిహారం.. ఇతర పునరావాసం కల్పించవచ్చని.. అలా కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. దీనివల్ల ప్రజలకు సమాన హక్కులు కలిగే విషయంలో అంతరాలు ఏర్పడతాయని హైకోర్టు స్పష్టం చేసింది. తాజా తీర్పుతో నాడు కరూర్ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని.. తమ బతుకులు బాగుపడతాయని వారు భావించగా.. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇబ్బందికరంగా మారింది. మరి దీనిపై విజయ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది.. ఏ విధమైన అడుగులు వేస్తుంది.. చూడాల్సి ఉంది.

నాడు ఉద్యోగ నియామక పత్రాలు అందించుకుంటూ విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు పోలీసుల మీద మండిపడ్డారు. అంతేకాదు కరూర్ మృతులకు నియామక పత్రాలు అందించి.. తనకు పొలిటికల్ మైలేజ్ పెరగడానికి తోడ్పాటు అందించుకున్నారు. అయితే దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు నేరుగా విమర్శలు చేయకపోయినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పనులు మాత్రం బ్రహ్మాండంగా చేశాయి. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయించాయి. చివరికి విజయ్ కి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ఇప్పుడు ఈ తీర్పు అక్కడి ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఆయుధాన్ని అందించినట్లు అయింది. కోర్టు తీర్పురావడమే ఆలస్యం.. డీఎంకే . అన్న డిఎంకె టీవీకే మీద ఎదురు దాడి మొదలుపెట్టాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Kerala Innovation

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Arunachalam Moksha Margam

Arunachalam Moksha Margam: అరుణాచలం మోక్షమార్గం.. తెలుగు భక్తులకే ఎందుకీ కష్టాలు..

Arunachalam Moksha Margam: అప్పుడెప్పుడో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అరుణాచలంలో ప్రదక్షిణలు చేయాలని.. మోక్ష మార్గం నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఆయన చెప్పడమే ఆలస్యం తెలుగు భక్తులు అప్పటినుంచి...
Oktelugu Epaper