Homeజాతీయ వార్తలుTrump Tariff Strategy: ట్రంప్‌ టారిఫ్‌ వ్యూహం.. భారత్‌తో బిజినెస్‌ డీల్‌ ఏం జరుగనుంది?

Trump Tariff Strategy: ట్రంప్‌ టారిఫ్‌ వ్యూహం.. భారత్‌తో బిజినెస్‌ డీల్‌ ఏం జరుగనుంది?

Trump Tariff Strategy: అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయిన డొనాల్డ్‌ ట్రంప్‌.. బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలకే ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన అనాలోచిత నిర్ణయాలతో అమెరికన్లకు, అమెరికాలో స్థిరపడిన వారికి సాక్‌ ఇస్తున్నారు. ఇక టారిఫ్‌ల పేరుతో ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. అమెరికాతో బిజినెస్‌ డీల్‌ చేసుకుంటేనే టారిఫ్‌లపై పునరాలోచన చేస్తానని హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో భారత్‌తో అమెరికా బిజినెస్‌ డీల్‌ ఎలా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల 14 దేశాల నాయకులకు లేఖలు పంపి, వాణిజ్య విధానాలపై తన దృఢమైన వైఖరిని వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరే దశలో ఉందని ప్రకటించారు. అయితే ఇతర దేశాలతో ఒప్పందాలు కుదరని పక్షంలో టారిఫ్‌లు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. ఆగస్ట్‌ 1 తర్వాత విధించబోయే టారిఫ్‌ల వివరాలను తెలియజేశారు. ఈ లేఖలు ఒప్పందాలు కుదరని దేశాలపై ఆర్థిక ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఉన్నాయి. బ్రిటన్, చైనాతో ఇప్పటికే తాత్కాలిక టారిఫ్‌ తగ్గింపు ఒప్పందాలు కుదిరినప్పటికీ, ఇతర దేశాలతో చర్చలు విఫలమైనట్లు ట్రంప్‌ సూచించారు. ఈ వ్యూహం ట్రంప్‌ ‘‘అమెరికా ఫస్ట్‌’’ విధానాన్ని ప్రతిబింబిస్తుంది, వాణిజ్య ఒప్పందాల ద్వారా అమెరికాకు గరిష్ట ప్రయోజనాలను కాపాడటం లక్ష్యంగా ట్రంప్‌ ఈ విధానం అవలంబిస్తున్నారు.

ఆశాజనక సంకేతాలు
ట్రంప్‌ ప్రకారం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం సమీప భవిష్యత్తులో కుదిరే అవకాశం ఉంది. 2024లో భారత్‌–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 130 బిలియన్‌ డాలర్లకు చేరిన నేపథ్యంలో, ఈ ఒప్పందం భారత్‌కు టారిఫ్‌ భారాన్ని తగ్గించడంలో కీలకం కానుంది. భారత్‌ ఈ ఒప్పందం ద్వారా అమెరికా మార్కెట్‌లో తన వస్తువులకు మెరుగైన అవకాశాలను పొందవచ్చు, అయితే దీనికి బదులుగా అమెరికా సంస్థలకు భారత మార్కెట్‌లో ఎక్కువ యాక్సెస్‌ ఇవ్వాల్సి రావచ్చు. ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా మన ఎగుమతి రంగానికి ఏమేరకు ప్రయోజనాలను తెచ్చిపెడుతుందనేది ఆసక్తిగా మారింది.

Also Read: జస్ట్ ఐదేళ్లల్లో చైనాను పక్కన నెట్టి .. అమెరికా సరసన.. మన డిఆర్డిఏ ఏం చేస్తోందంటే?

వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే ట్రంప్‌ మరోసారి భారత్‌–పాకిస్తాన్‌ మధ్య మే 2025లో జరిగిన సీజ్‌ఫైర్‌ను తానే సాధించానని, వాణిజ్య ఒప్పందాలను ఒత్తిడి సాధనంగా ఉపయోగించానని పేర్కొన్నారు. అయితే, భారత ప్రభుత్వం ఈ వాదనలను బలంగా తోసిపుచ్చింది, సీజ్‌ఫైర్‌ రెండు దేశాల సైనిక అధికారుల మధ్య సంప్రదింపుల ద్వారా సాధించినట్లు స్పష్టం చేసింది. ట్రంప్‌ వ్యాఖ్యలు భారత్‌లో రాజకీయంగా సున్నితమైన అంశమైన కాశ్మీర్‌పై మూడో పక్ష జోక్యానికి వ్యతిరేకమైన భారత వైఖరిని ఉల్లంఘించాయనే విమర్శలు వచ్చాయి. ఇవి తాత్కాలిక ఒత్తిడి కలిగించినా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి.

Also Read: ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను అప్పగిస్తారట.. పాక్ ఎందుకు తలొగ్గుతోంది!

గ్లోబల్‌ వాణిజ్యంపై ట్రంప్‌ వ్యూహం..
ట్రంప్‌ టారిఫ్‌ హెచ్చరికలు, ఒప్పందాల వ్యూహం గ్లోబల్‌ వాణిజ్య పరిస్థితిని మార్చే అవకాశం ఉంది. బ్రిటన్, చైనాతో ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో, భారత్‌తో చర్చలు విజయవంతమైతే, అమెరికా ఆర్థిక విధానంలో భారత్‌ కీలక భాగస్వామిగా మారవచ్చు. అయితే, టారిఫ్‌ల విధానం ఇతర దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉంది. ఇది గ్లోబల్‌ సప్లై చైన్‌లపై ప్రభావం చూపవచ్చు. ట్రంప్‌ ఈ విధానం దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినప్పటికీ, దీని పరిణామాలు దేశాల మధ్య సంబంధాలను సంక్లిష్టం చేసే ప్రమాదం కూడా ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular