Homeజాతీయ వార్తలుTrain Travel : భోగీల్లోనూ మూడో కన్ను.. రైలు ప్రయాణం మరింత సురక్షితం!

Train Travel : భోగీల్లోనూ మూడో కన్ను.. రైలు ప్రయాణం మరింత సురక్షితం!

Train Travel : రైలు ప్రయాణాన్ని సుఖవంతం చేయడంతోపాటు సురక్షితంగా ఉంచేందుకు భారత రైల్వే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటోంది. ఇకెట్‌ బుకింగ్‌ సులభతరం చేసింది. రైలు ఆలస్యం తగ్గించింది. తాజాగా సురక్షిత ప్రయాణానికి సీసీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది.

భారతీయ రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 74 వేల ప్యాసింజర్‌ బోగీలు, 15 వేల లోకోమోటివ్‌లలో అత్యాధునిక కెమెరాలను అమర్చే నిర్ణయం, ఉత్తర రైల్వేలో నిర్వహించిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో తీసుకోబడింది. ఈ చర్య దోపిడీలు, దాడుల వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంతో పాటు, ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది.

Also Read: ఇండస్ట్రీలో మరో విషాదం. ఎన్టీఆర్ హీరోయిన్ కన్నుమూత

దేశవ్యాప్త అమలు..
ఉత్తర రైల్వే విభాగంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఈ పైలట్‌ ప్రాజెక్టు ఫలితాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, సహాయ మంత్రి రవ్నీత్‌ సింగ్‌ బిట్టు సమీక్షించి, దేశవ్యాప్తంగా అన్ని బోగీలు, లోకోమోటివ్‌లలో కెమెరాలను అమర్చాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం రైల్వే శాఖ భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయనుంది.

భద్రతకు హామీ..
సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా రైలు ప్రయాణంలో భద్రతా సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. బోగీలలో దొంగతనాలు, వ్యవస్థీకృత ముఠాల ఆగడాలను నిరోధించడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రయాణికుల ప్రైవసీని గౌరవిస్తూ, కెమెరాలను బోగీల ద్వారాల వద్ద మాత్రమే ఏర్పాటు చేయనున్నారు, దీనివల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.

అత్యాధునిక కెమెరాలు..
ప్రతీ ప్యాసింజర్‌ బోగీలో నాలుగు డోమ్‌ టైప్‌ కెమెరాలు, లోకోమోటివ్‌లలో ఆరు కెమెరాలు (ముందు, వెనుక, రెండు వైపులా డోమ్‌ టైప్, రెండు డెస్క్‌ మౌంటెడ్‌ మైక్రోఫోన్‌ కెమెరాలు) అమర్చనున్నారు. ఈ కెమెరాలు టీక్యూసీ సర్టిఫికేషన్‌తో అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంటాయి. రైలు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ, తక్కువ వెలుతురు పరిస్థితుల్లో కూడా స్పష్టమైన ఫుటేజీని అందిస్తాయి. రైల్వే మంత్రి ఈ కెమెరాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చూడాలని ఆదేశించారు.

Also Read: శ్రీకాంత్ ఓదెల చిరంజీవి కాంబోలో వచ్చే మూవీ స్టోరీ ఏంటో తెలుసా..?

ఏఐ సాంకేతికతతో విశ్లేషణ..
సీసీటీవీ కెమెరాల డేటాను సేకరించి విశ్లేషించడంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికతను వినియోగించాలని రైల్వే మంత్రి సూచించారు. ఇండియా ఏఐ మిషన్‌ సహకారంతో, ఈ డేటా విశ్లేషణ ద్వారా అసాధారణ కార్యకలాపాలను వేగంగా గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. ఈ సాంకేతికత రైల్వే భద్రతా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చనుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular