spot_img
Homeఆంధ్రప్రదేశ్‌TDP: టీడీపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి?

TDP: టీడీపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి?

TDP: ఆంధ్రప్రదేశ్ లో నేడు టీడీపీ ఆవిర్భావ సభ నిర్వహించారు. అధికారానికి దూరమైన నేపథ్యంలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఆవిర్బవించి నలభై ఏళ్లు అవుతున్న సందర్భంలో రెండు దశాబ్దాలు అధికారంలో ఉండి 19 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది. దీంతో రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే కార్యకర్తలను కార్యోణ్ముఖులను చేస్తున్నారు. ఇందుకు అందరిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

TDP
Chandrababu Naidu

ఇక చంద్రబాబు తరువాత లీడర్ గా కొనసాగేందుకు లోకేష్ కు అవకాశాలు తెస్తున్నా ఆయన మాత్రం తన స్వయంకృతాపరాధంతో కార్యకర్తలకు దగ్గర కాలేకపోతున్నారు.దీనిపై చంద్రబాబు ఆలోచనలో పడుతున్నారు. తన వారసుడిగా లోకేష్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సింది పోయి పలుమార్లు నవ్వులపాలు అవుతున్నారు. తన తెలివితేటలను ప్రదర్శించి అందరిని ఆకట్టుకోవాల్సిన నేత అందరిలో గుర్తింపు పొందలేకపోతున్నారు. కార్యకర్తలు లోకేష్ ను తమ భవిష్యత్ నాయకుడిగా చూడటం లేదు. అదే చంద్రబాబుకు బాధ కలిగిస్తోంది. తన కొడుకు సరిగా వ్యవహరిస్తే తనకు ఈ బాధలు ఉండేవి కాదని తల పట్టుకుంటున్నారు.

Also Read: MLA Rajaiah: మరో వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య?

మరోవైపు పార్టీని నడిపించాలంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రాతినిధ్యం ఉండాల్సిందేననే వాదన కూడా కార్యకర్తల్లో వస్తోంది. ఇన్నాళ్లు అధికారానికి దూరమైన నేపథ్యంలో ఎన్టీఆర్ వస్తేనే పార్టీ పరిస్థితి మారుతుందని కార్యకర్తలు కోరుతున్నారు. దీనిపై చంద్రబాబు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయన ఆతిథ్యం మాత్రం టీడీపీకి కచ్చితంగా ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పార్టీని గాడిలో పెట్టాలంటే సమర్థులైన నాయకులు కావాలని కార్యకర్తలు సూచిస్తున్నారు. ఆ సత్తా జూనియర్ ఎన్టీఆర్ కు ఉందని తెలుస్తోంది.

TDP
Chandrababu Naidu

బీసీల పార్టీగా గుర్తింపు పొందిన టీడీపీని వచ్చే ఎన్నికల్లో అధికారంలో కూర్చోబెట్టాలంటే భారీ కసరత్తు ఉండాల్సిందే. నేతల సహకారం తప్పనిసరి. ఇప్పటికే వైసీపీ 151 సీట్లతో అధికారంలో ఉండటంతో దాన్ని దించాలంటే ఇంకా ఎక్కవ శక్తిగల నేతలు ఉండాల్సిందే. వారి మాటలకు ప్రజలు బ్రహ్మరథం పట్టాల్సిందే. అలాంటి వారైతేనే టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తుందని కార్యకర్తలు అభిలషిస్తున్నారు. దీనికి సమర్థుడు కార్యదీక్షాపరుడు అంటే ఎన్టీఆర్ అనే మాట అందరు కార్యకర్తల్లో నానుతోంది.

చంద్రబాబు కూడా ఎన్టీఆర్ ను ఆహ్వానించి పార్టీని గెలిపించేందుకు వ్యూహాలు ఖరారుచేసుకోవాల్సిన సమయం వచ్చింది. రానున్న రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్నందున అప్పటికే ఒక సమగ్ర రూపం రావాల్సిందే. లేకపోతే అప్పటికప్పుడు అంటే కష్టం. అందుకే ఎన్టీఆర్ ను పార్టీ కోసం పని చేయాలని కోరాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించాలి.

Also Read: Janasena Party: జనసేనలోకి ఆ రెండు పార్టీలు.. ఏపీ భవిష్యత్తు సీఎం పవన్ కళ్యాణ్ యేనా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Oktelugu Epaper