Homeజాతీయ వార్తలుTelangana Assembly : 3 నుంచి అసెంబ్లీ: ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే...

Telangana Assembly : 3 నుంచి అసెంబ్లీ: ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే…

Telangana assembly : శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉభయసభలు ఆరోజు మధ్యాహ్నం నుంచి మొదలవుతాయి.. నిజానికి డిసెంబర్లో శీతాకాలం సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. కానీ భారత రాష్ట్ర సమితిని విస్తరించే క్రమంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లడంతో సమావేశాలు జరగలేదు. వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 6, 12, 13 తేదీలలో జరిగాయి.. ఇక నుంచి ఆరు నెలల్లోపు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.. అందులో వచ్చే నిధులను పరిశీలించి, రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అందుకే ఫిబ్రవరి 3 నుంచి సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించింది.

telangana assembly

గవర్నర్ ప్రసంగం లేకుండానే

ఈసారి నిర్వహించే సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.. గత బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే జరిగాయి.. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద రాద్ధాంతం జరిగింది.. రాజ్ భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య వివాదాన్ని రాజేసింది. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాల్సి ఉన్నందున… ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి అనుమతి ఇస్తున్నట్టు అప్పట్లో గవర్నర్ వెల్లడించడం గమనార్హం.. కానీ అంతకుముందు సమావేశాలకు కొనసాగింపుగానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తున్నామని, ఈ దృష్ట్యా గవర్నర్ అనుమతి అవసరం లేదని స్పీకర్ సమావేశాలను ప్రారంభించవచ్చంటూ అప్పట్లో ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి.

అయితే ఈసారి కూడా అదే ఆనవాయితీ ప్రభుత్వం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.. ఎందుకంటే గవర్నర్, ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తోంది. భారత రాష్ట్ర సమితి నాయకులు గవర్నర్ ను, లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు.. గవర్నర్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. నిజానికి సమావేశాలను గవర్నర్ ప్రారంభించడం సాంప్రదాయం.. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు మాట్లాడతారు.. అయితే ఇలాంటి వ్యవహారం ఏమీ లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తుండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

TDP MLA

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...
Newtons Third Law

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...
Corona alert in AP

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....
Operation Aranya

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
VVS Laxman

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...
Oktelugu Epaper