Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: జగన్ యాక్షన్.. అధికారుల ఓవర్ యాక్షన్

CM Jagan: జగన్ యాక్షన్.. అధికారుల ఓవర్ యాక్షన్

CM Jagan: పక్షం రోజుల క్రితం కురిసిన వర్షాలకు రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు, కడప, నెల్లూరు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ప్రాణనష్టం, ఆస్తినష్టం భారీగానే చోటుచేసుకోగా.. వేలాది మంది వారికి ఉన్న నీడను కోల్పోయారు. దిక్కులేని వాళ్లలా రోడ్డున పడ్డారు. పంటపొలాలు నీటమునగగా.. గొడ్డూ, గోద వరదలో కొట్టుకుపోయాయి. వారం రోజులకు పరిస్థితి కాస్త చక్కపడగా.. మధ్యలో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి వరద పరిస్థితిపై, అక్కడ ఇబ్బందులు పడుతున్న వారిని గురించి పట్టించుకోలేదన్న ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. ఈ క్రమంలో రెండు, మూడు రోజులపాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలోని కడప, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
CM Jagan
ఇంతవరకు బాగానే ఉన్నా.. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా స్థానిక అధికారులు ఓవర్ యాక్షన్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన ఉందని ముందుగానే తెలుసుకుని ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తారో.. ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశారని సమాచారం. అంటే.. జగన్ ఎక్కడెక్కడ తిరగాలి.. ఎవరితో మాట్లాడాలి.. సీఎం జగన్ తో ఎవరెవరు మాట్లాడాలి..? సమస్యలు ఎవరు చెప్పాలి.. జేజేలు ఎవరు కొట్టాలి అనే అంశం మొత్తం అధికారులు ముందుగానే రెడీ చేసుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలో జగన్ పర్యటించిన పలు ప్రాంతాల్లో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. వరద ప్రాంతాల్లో సీఎం పర్యటించే సమయంలో జగన్ దగ్గరికి ఎవరు ఎవరు రావాలి..? జగన్ తో ఎవరు మాట్లాడాలి.. ఏఏ సమస్యలపై మాత్రమే చర్చించాలనే అంశాన్ని ముందుగానే చెప్పి ఉంటారు. ఇదే క్రమంలో జగన్ పర్యటించే ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజల వద్దకు ముందుగానే గ్రామ వలంటీర్లను పంపించి.. ముందస్తు ప్రిపరేషన్ చేశారని చెప్పుకుంటున్నారు.

Also Read: Rosaiah Death: చిరంజీవిని రాజకీయాల్లోకి తెచ్చి.. వైఎస్ఆర్, చంద్రబాబులకు కుడిభుజంగా మారి.. రోశయ్య ప్రస్థానం

అంటే.. ఒక ప్రతిపక్ష నేతగా మూడువేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ సమయంలో.. ప్రజలతో కలిసిపోయారు. ప్రతీఒక్కరి ఇంటికి వెళ్లారు. అక్కున చేర్చుకున్నారు. సమస్యలు ఓపిగ్గా విన్నారు. పరిష్కారానికి మార్గం చూపుతామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్న ఉన్న సమయంలో ఉన్న కలుపుగోలు తనం ఇప్పుడు ఎందుకు లేదని కొందరు అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి ప్రొటోకాల్ ప్రకారం.. నిక్కచ్చిగానే వ్యవహరించాలి.. అయితే.. మరీ సెలెక్టెడ్ వ్యక్తులతోనే మాట్లాడడం.. అందుకు సంబంధించిన స్క్టిప్టు కూడా అధికారులే ప్రజలకు ముందుగా ఇవ్వడం ద్వారా ప్రజల్లో జగన్ ఉండే మైలేజీ దెబ్బతింటుందని కొందరు అంటున్నారు. భవిష్యత్ లో ఇది ప్రమాదకరమని.. రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Also Read: Konijeti Rosaiah: మాజీ సీఎం రోశయ్య ఇకలేరు.. ఆయన ప్రస్థానం..!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...
Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Oktelugu Epaper