Homeఅంతర్జాతీయంఅతిదారుణంగా స్కూల్ పిల్లలపై కత్తితో దాడి!

అతిదారుణంగా స్కూల్ పిల్లలపై కత్తితో దాడి!

అభం శుభం ఎరుగని 37 మంది చిన్నారులను అతి కిరాతకంగా కత్తితో పొడిచిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఓ సెక్యూరిటీ గార్డ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. మానవత్వాన్ని మంట గలుపుతూ.. ప్రైమరీ స్కూల్ విద్యార్థుల మీద దాడికి పాల్పడ్డాడు. 37 మంది పిల్లలను కత్తితో పొడిచాడు. మరో ఇద్దరు పెద్దవారి మీద కూడా కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన చైనాలోని చాంగ్ ఉ కౌంటీలో జరిగింది. రోజూ వెళ్తున్నట్లుగానే ఈ రోజు కూడా విద్యార్థులు […]

China school children

అభం శుభం ఎరుగని 37 మంది చిన్నారులను అతి కిరాతకంగా కత్తితో పొడిచిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఓ సెక్యూరిటీ గార్డ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. మానవత్వాన్ని మంట గలుపుతూ.. ప్రైమరీ స్కూల్ విద్యార్థుల మీద దాడికి పాల్పడ్డాడు. 37 మంది పిల్లలను కత్తితో పొడిచాడు. మరో ఇద్దరు పెద్దవారి మీద కూడా కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన చైనాలోని చాంగ్ ఉ కౌంటీలో జరిగింది.

రోజూ వెళ్తున్నట్లుగానే ఈ రోజు కూడా విద్యార్థులు స్కూలుకు వచ్చారు. 8.30 గంటల సమయంలో వారు స్కూల్లో ఉన్నప్పుడు 50 ఏళ్ళ వయసున్న ఓ సెక్యూరిటీ గార్డ్ చేతిలో కత్తితో దాడిచేశాడు. క్లాసులో ఉన్న విద్యార్థులు కనిపించిన వారిని కనిపించినట్టు పొడిచాడు. అడ్డుకోబోయిన ఇద్దరు టీచర్ల మీద కూడా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన 39 మందిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ‘అతడు ఓ ఉన్మాదిలా ప్రవర్తించాడు. అసలు అడ్డుకోలేకపోయాం.’ అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో చిన్న పిల్లలకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. టీచర్లకు మాత్రం బలమైన గాయాలు అయినట్టు చెప్పారు. కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలల పాటు చైనాలో స్కూళ్లు మూత పడ్డాయి. మేలో పునఃప్రారంభించారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper