అభం శుభం ఎరుగని 37 మంది చిన్నారులను అతి కిరాతకంగా కత్తితో పొడిచిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఓ సెక్యూరిటీ గార్డ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. మానవత్వాన్ని మంట గలుపుతూ.. ప్రైమరీ స్కూల్ విద్యార్థుల మీద దాడికి పాల్పడ్డాడు. 37 మంది పిల్లలను కత్తితో పొడిచాడు. మరో ఇద్దరు పెద్దవారి మీద కూడా కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన చైనాలోని చాంగ్ ఉ కౌంటీలో జరిగింది.
రోజూ వెళ్తున్నట్లుగానే ఈ రోజు కూడా విద్యార్థులు స్కూలుకు వచ్చారు. 8.30 గంటల సమయంలో వారు స్కూల్లో ఉన్నప్పుడు 50 ఏళ్ళ వయసున్న ఓ సెక్యూరిటీ గార్డ్ చేతిలో కత్తితో దాడిచేశాడు. క్లాసులో ఉన్న విద్యార్థులు కనిపించిన వారిని కనిపించినట్టు పొడిచాడు. అడ్డుకోబోయిన ఇద్దరు టీచర్ల మీద కూడా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన 39 మందిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ‘అతడు ఓ ఉన్మాదిలా ప్రవర్తించాడు. అసలు అడ్డుకోలేకపోయాం.’ అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో చిన్న పిల్లలకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. టీచర్లకు మాత్రం బలమైన గాయాలు అయినట్టు చెప్పారు. కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలల పాటు చైనాలో స్కూళ్లు మూత పడ్డాయి. మేలో పునఃప్రారంభించారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Security guard injures 37 in knife attack in china
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com