Homeజాతీయ వార్తలుపంజాబ్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్

పంజాబ్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు మంచి పేరుంది. ఏ రాష్ర్టంలో ఎలక్షన్లు జరిగినా ఆయన పేరు వినిపిస్తుంది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో ఆయన చూపిన మార్గంలో నడిచి విజయ తీరాలకు చేరాయి పార్టీలు. ఇప్పుడు మరో రాష్ర్టం అదే దారిలో నడిచేందుకు సమాయత్తమవుతోంది. పంజాబ్ రాష్ర్టంలో జరిగే ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.

తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రావడానికి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి మార్గం సుగమమైంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గెలుపు ఖాయమని భావించినా ప్రశాంత్ కిషోర్ ప్రణాళికతోనే పార్టీ విజయతీరాలకు చేరిందనే విషయం తెలుస్తోంది.

ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం పంజాబ్ ఎన్నికలపై దృష్టి సారించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల తర్వాత పంజాబ్ కు షిఫ్ట్ అవుతున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్   అమరీందర్  సింగ్ ప్రశాంత్ కిషోర్ ను ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం పంజాబ్ లో పని ప్రారంభించింది.

పంజాబ్  లో 117 స్థానాలున్నాయి. ఇక్కడ మరోసారి కాంగ్రెస్ కు విజయావకాశాలు ఉన్నాయి. రాష్ర్టంలో బీజేపీ పరిస్థితి అధ్వానంగా మారింది. రైతు చట్టాలతో తన ప్రతిష్టను దిగజార్చుకుంది. మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ సైతం వైదొలగడంతో బీజేపీ ఒంటరిగా పో టీ చేస్తోంది. దీంతో ప్రశాంత్ కిషో ర్ పంజాబ్ లో తన హవా చూపెట్టాలని  భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తూ తన రేటింగ్ ను పెంచుకుంటున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version