ప్రభుత్వ తీరుపై ఫైర్ అయిన పవన్

జంట నగరాల్లో హాస్టళ్ల నుంచి వచ్చిన వాళ్లు ఏపీ సరిహద్దుల్లో ఆపేయడం పై జనసేన అధినేత ఫైర్ అయ్యారు. రెండు రాష్ట్రాల అధికారులు ముందే సమన్వయంతో చర్చించుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టి వారిని స్వస్థలాలకు పంపాలని కోరారు. ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా ఏపీ సీఎం జగన్‌ కు పవన్‌ విజ్ఞప్తి చేశారు. ‘‘హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన […]

Written By: Neelambaram, Updated On : March 26, 2020 7:08 pm
Follow us on

జంట నగరాల్లో హాస్టళ్ల నుంచి వచ్చిన వాళ్లు ఏపీ సరిహద్దుల్లో ఆపేయడం పై జనసేన అధినేత ఫైర్ అయ్యారు. రెండు రాష్ట్రాల అధికారులు ముందే సమన్వయంతో చర్చించుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టి వారిని స్వస్థలాలకు పంపాలని కోరారు. ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా ఏపీ సీఎం జగన్‌ కు పవన్‌ విజ్ఞప్తి చేశారు.

‘‘హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నో అబ్జెక్షన్ పత్రాలతో బయలుదేరిన ఏపీ వారిని సరిహద్దుల్లో ఆపివేయడంతో నడిరోడ్డుపై ఇప్పటికీ ఇబ్బందులుపడుతున్నారు. హాస్టల్స్ మూసివేతపై రెండు రాష్ట్రాల అధికారులు ముందే సమన్వయంతో చర్చించుకొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. వీరిలో చదువుకుంటున్నవారు.. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న యువతీయువకులు ఉన్నారు. వారి వేదనను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకొని స్వస్థలాలకు చేర్చాలి. అవసరమైన వైద్య పరీక్షలు చేసి హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించండి. అలా రోడ్డుపై గుంపులుగా వదిలేస్తే కొత్త సమస్యలు వస్తాయి’’ అని పవన్‌ అన్నారు.

“రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందిలో అందరికీ ఎన్-95 మాస్కులు అందడం లేదని వైద్యులు చెబుతున్నారు. అనుమానితుల శాంపిల్స్ సేకరించి పరీక్షించే సిబ్బందితో పాటు సంబంధిత వైద్యులను ప్రభుత్వం పట్టించుకోవాలి. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి అవసరమైన మాస్కులు, రక్షణ దుస్తులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలి. ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగంలో ఉన్నవారికీ వీటిని అందించడం అవసరం. రాష్ట్రంలో టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్యతో పాటు వాటిలో శాంపిల్స్ పరీక్షించే సామర్థ్యాన్ని పెంచాలి’’ అని సీఎంకు సూచించారు.