ఒక యజమాని సంపాదనకు కేవలం పిల్లలు, భార్య మాత్రమే కాదు.. తల్లిదండ్రులు సైతం వాటాదారులేనని తేల్చింది కోర్టు. మేనేజ్మెంట్ కేసుకు సంబంధించి కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. హజారేకి సంబంధించిన ప్రదేశంలో జడ్జి గిరీష్ కత్పాలియాఅప్లికేషన్ గురించి విని ఢిఫెండెంట్ భార్యని తన భర్త ఆదాయాన్ని ఫైల్ చేయమని చెప్పాడు.
Also Read: రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. పది మంది ఇన్చార్జ్ మంత్రులు
తన భర్త ఆదాయం నెలకి 50,000 రూపాయలని చెప్పింది. ఆమె భర్త తనకి, తన కొడుకుకి నెలకి రూ.10000 మాత్రమే ఇస్తున్నాడని చెప్పింది. కోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ను ఆ వ్యక్తికి సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ చేయమంది. సరైన ఆధారాలు అతను ప్రవేశపెట్టాడు. అతని ఇన్కమ్ టాక్స్ అకౌంట్కు సంబంధించి అతని నెలవారి ఆదాయం రూ.37,000 అతనే అనారోగ్య ఖర్చులను, రోజు వారి ఖర్చులు భరిస్తాడని నివేదిక ద్వారా వెల్లడించింది.
కానీ.. ఈ విషయాన్ని కోర్టు చాలా సీరియస్గా పరిగణించింది. అయితే.. భర్త తన బిడ్డల పట్ల చాలా బాధ్యత వహించాలని అందుకే వాళ్ల మెయింటనెన్స్ డబ్బులు పెంచాలని చెప్పిన సంగతి తెలిసినదే. కానీ కోర్టు ఆ వ్యక్తి యొక్క ఆదాయాన్ని ఆరు భాగాలుగా విభజించింది. కొడుకు, భార్య, అమ్మ, నాన్న కి ఒక్కొక్క షేర్ ఇవ్వాలని చెప్పింది. కోర్టు భరణాన్ని పెంచాలన్న విజ్ఞప్తిని కొట్టివేసింది.
Also Read: చంద్రబాబుకు చోటు దక్కినా.. పవన్కు దొరకకపాయె
భార్య కొడుకు వాటా 12,500 రూపాయలు అని కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందువల్ల భర్త ప్రతీనెల 10వ తేదీన తన భార్య, కొడుకుకి ఇంత భరణాన్ని చెల్లించాలి. అలానే కోర్టు ఏం చెప్పిందంటే ఒక వ్యక్తి ఒక ఆదాయం ఒక కేకు లాంటిది. దానిని కుటుంబమంతా సమాన ముక్కలుగా చేసుకుని తీసుకోవాలి అని సూచించింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్