West Bengal elections : బెంగాల్ ఎన్నికలు యుద్ధ రణరంగాన్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఎస్.ఐ.ఆర్ పై పెద్ద యుద్ధం జరుగుతోంది. ఏ రాష్ట్రంలోనూ ఇంత వివాదం లేదు. బెంగాల్ లో మమతా బెనర్జీ స్వయంగా ముఖ్యమంత్రి అయ్యిండి అధికార యంత్రాంగాన్ని ఈ ఎస్.ఐఆర్ ను చేయవద్దని సహాయ నిరాకరణ చేస్తోంది. ఎలక్షన్ కమిషన్ కు సహకరించకుండా వివాదాన్ని రాజేస్తోంది. డేట్ అయిపోతున్నా స్క్రూటీని చేయడం లేదు.
దీంతో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. జడ్జీలనే తీసుకొచ్చి అధికారిగా పెడుదాం అని సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం బెంగాల్ సీఎం మమతకు చెంపపెట్టుగా మారింది. జడ్జీలు, జూనియర్ జడ్జీలు 735 మంది బీఎల్.ఓగా పనిచేస్తూ మొత్తం స్క్రూటీని చేస్తున్నారు. ఈ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచి 7.7 ఓటర్లు ఎస్.ఐఆర్ కు ముందు ఉంటే 7.08 కోట్లతో పబ్లిష్ అయ్యింది.. స్క్రూటీని చేయగా 6.44 కోట్లతో ఫైనల్ చేశారు.
సుప్రీంకోర్టు ఫైనల్ పబ్లిష్ చేసినా స్క్రూటీని చేయాల్సిన 60లక్షల ఓటర్లు ఉన్నారు. దఫాలుగా స్క్రూటీని చేయడానికి అనుమతించింది. ఈ 60లక్షల్లో చాలా మంది పోయే అవకాశం ఉంది.
యస్.ఐ.ఆర్ తో మమతకు ముచ్చెమటలు అందుకే ధర్నా.. దీనిపై ‘రామ్‘గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
