America war ambitions Gulf countries impact: అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ముదిరిన ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాలను యుద్ధ క్షేత్రంగా మార్చేసింది. తమకు సంబంధం లేకపోయినా ఇరాన్ ప్రతీకార దాడులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి నెలకొంది. 24 గంటల వ్యవధిలోనే గల్ప్ కోఆపరేషన్ దేశాలను ఇరాన్ టార్గెట్ చేసింది. యూఏఈ, సౌదీ, ఖతార్, బహ్రెన్, కువైట్పై వైమానిక దాడులు చేస్తుంది. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. మరోవైపు హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఆయిల్ రవాణా ఆగిపోయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి.
గల్ఫ్లో దాడుల పరిణామాలు
ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దుబాయ్ విమానాశ్రయం, చారిత్రక భవనాలు, దోహా ప్రాంతాలు, కువైట్ ఎయిర్పోర్ట్లపై దాడి చేస్తున్నాయి. యూఏఈలో ముగ్గురు మరణించారు, 58 మంది గాయపడ్డారు. సౌదీ రాస్ ఉరా శుద్ధి కర్మాగారం, ఒమాన్ ట్యాంకర్లు కూడా లక్ష్యాలుగా మారాయి. ఈ దాడులు గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి, ప్రజల జీవనాలను ప్రమాదంలో ఉంచాయి.
ఆర్థిక నష్టాలు
హోర్ముజ్ మూసివేతతో ప్రపంచ చమురు సరఫరా 20% ఆగిపోయింది. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. సౌదీ, ఖతార్, యూఏఈ విమాన మార్గాలు, ఓడరేవుల మూసివేతతో ఆయా దేశాలు భారీగా నష్టపోతున్నాయి. ఈ పరిస్థితి భారత్, భారతీయ దక్షిణాసియా వంటి దేశాల్లో ఇంధన ధరల పెరుగుదలకు దారితీసింది.
Also Read: కష్టకాలంలో ఇరాన్ కు నమ్మకద్రోహం చేసిన రష్యా, చైనా
గల్ఫ్ దేశాల స్పందన
ఇరాన్ దాడులు జీసీసీ దేశాలను అమెరికా–ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపించాయి, తమ భద్రతా వ్యవస్థలను పునఃపరిశీలించేలా చేశాయి. ట్రంప్ ’రెజీమ్ చేంజ్’ వాదనలతో ఒత్తిడి పెంచినా, గల్ఫ్ నేతలు యుద్ధంలో చేరకుండా రక్షణ చర్యలకు మొగ్గు చూపుతున్నారు. ఇది ప్రాంతీయ కూటములను మలుపు తిప్పి, దీర్ఘకాల భద్రతా మార్పులకు దారితీస్తుంది.
ఈ సంఘర్షణ గ్లోబల్ చమురు మార్కెట్లను కలవరపరుస్తూ, ఆసియా–యూరప్ ఆర్థికాలను దెబ్బతీస్తోంది. ఇరాన్ వ్యూహం గల్ఫ్ను యుద్ధంలో లాగి, అమెరికా మద్దతును బలపరచడమే లక్ష్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. దీర్ఘకాలంలో గల్ఫ్ దేశాలు యూఎస్పై ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలు వెతికే అవకాశం ఉంది.