Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ను 15 ఏళ్లు ఏకచత్రాధిపత్యంగా పాలించారు మమతా బెనర్జీ. అక్కడి కమ్యూనిస్టు పాలకుల రికార్డును చెరిపేయాలని ప్రయత్నించారు. కానీ అమె అనుసరించిన విధానాలు, భారత వ్యతిరేక ధోరణి, వసలవాదుల అనుకూల వైఖరి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమతతోపాటు, తృణమూల్ కాంగ్రెస్ను బెంగాలీలు చిత్తుగా ఓడించారు. అధికారం కోల్పోవడంతో పార్టీలో ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయి. అధినేత్రి అదేశాలను కూడా గెలిచిన ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదు. దీంతో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీలో ఉత్పన్నమైన అసంతృప్తి, నాయకుల వలసలు, సంస్థాగత బలహీనతలు మమతా ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి.
అంతర్గత అసంతృప్తి, ఎమ్మెల్యేల తిరుగుబాటు..
ఇటీవలి ఎన్నికల తర్వాత టీఎంసీ ఆహ్వానించిన ధర్నా కార్యక్రమం పార్టీ బలహీనతను బహిర్గతం చేసింది. మొత్తం ఎమ్మెల్యేలలో కేవలం 40 శాతం మంది మాత్రమే పాల్గొనడం ద్వారా పార్టీలోని వ్యతిరేకత స్పష్టమైంది. తర్వాతి ఎమ్మెల్యేల సమావేశాల్లో హాజరు ఇంకా తగ్గి, 25వ తేదీ నాటికి 40 మందికిపైగా గైర్హాజరు అయ్యారు. హాజరైన ఎమ్మెల్యేలు పార్టీ నిర్వహణను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ నాయకత్వ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఫాల్తా నియోజకవర్గం (అభిషేక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని) అభ్యర్థి జహంగీర్ ఖాన్ విషయంలో తీసుకున్న నిర్ణయం కూడా తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఇది పార్టీలో కుటుంబ ప్రాధాన్యతలపై ఉన్న వ్యతిరేకతను ప్రతిబింబిస్తుంది.
స్థానిక సంస్థల్లోనూ బలహీనం..
పార్టీ సంక్షోభం అసెంబ్లీ స్థాయిలో మాత్రమే కాకుండా స్థానిక సంస్థల వరకు వ్యాపించింది. ఎన్నికలు ముగిసిన వెంటనే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా, మున్సిపల్ కౌన్సిలర్లు కూడా బయటకు వస్తున్నారు. ఈ వలసలు టీఎంసీ గ్రాస్రూట్ స్థాయి బలాన్ని బలహీనపరుస్తున్నాయి. ఆసక్తికరంగా, బీజేపీ ఈ రకమైన టీఎంసీ నాయకులను చేర్చుకోవడానికి ఇష్టపడడం లేదని సంకేతాలు వస్తున్నాయి. దీని వల్ల బయటకు వచ్చిన నాయకులు రాజకీయంగా ఒంటరిగా మారే∙ప్రమాదం ఉంది.
సంస్థాగత సంక్షోభం..
టీఎంసీ ప్రధాన కార్యాలయం అద్దె భవనంలో ఉండటం, యజమాని ఖాళీ చేయమని నోటీసు ఇవ్వడం పార్టీ స్థితిని సంకేతిస్తోంది. సమావేశాలు నిర్వహించడానికి కూడా తగిన మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే మరో కీలక పరిణామం: భారాసాత్ ఎంపీ భారాసాత్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం. ఇలాంటి రాజీనామాలు పార్టీలోని ఉన్నత స్థాయి అసంతృప్తిని తెలియజేస్తాయి. మమత ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నిస్సహాయతకు గురవుతున్నారని అంచనా వేస్తున్నారు.
భవిష్యత్ ప్రశ్నార్థకం..
బెంగాల్లో కమ్యూనిస్టు శక్తులు ఇప్పటికీ కొంత పట్టు కలిగి ఉన్నాయి. అయితే రాబోయే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో చెప్పడం కష్టం. టీఎంసీలోని ప్రస్తుత సంక్షోభం కొనసాగితే, మమతా నాయకత్వం ఐదేళ్లు కూడా మనుగడ సాగించడం కష్టమే అనిపిస్తోంది. మమతా బెనర్జీ రాజకీయ ప్రయాణం ఎప్పుడూ సవాళ్లతో నిండి ఉంది. కానీ ఈసారి సవాళ్లు పార్టీ లోపలి నుంచి వస్తున్నాయి. అంతర్గత ఐక్యతను పునరుద్ధరించకపోతే, దశాబ్దాల పాలన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ వేగంగా క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
