Jagan going to lanch another new welfare scheme
ఏపీ చరిత్రలో భగీరథుడిగా మిగిలిపోవాలని సీఎం జగన్ కలలుగంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా పూర్తి చేయలేని పోలవరం సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 2024లో మరోసారి గెలిచేందుకు జగన్ పెద్ద ప్లాన్లు చేస్తున్నారట.. ఈ మేరకు ఏపీకి సాగునీటి కొరత తీరిస్తే తనకు ఓట్ల వాన కురుస్తుందని యోచిస్తున్నారని సమాచారం.
Also Read: వామ్మో… లోకేశ్ కోసం బాబు ఇంత చేశాడా..?
సాగునీటి ప్రాజెక్టుల కోసం ఒక రాష్ట్రం ప్రభుత్వం స్సెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)లు ఏర్పాటు చేయడం చాలా అరుదు. దేశంలో సాగునీటి ప్రాజెక్టుల నిధుల సమీకరణ కోసం ఎస్పీవీ ఏర్పాటు చేసిన తొలి సీఎం జగన్మోహన్ రెడ్డిగా చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నింటిని త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. వీటి నిర్మాణం కోసం ఐదేళ్లలో కనీసం రూ.96,550కోట్లు వ్యయం చేసేందుకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వాటికోసం రూ. 84,092 కోట్లు వ్యయం చేయాలి. అలాగే కొత్త ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.72,458 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసుకుంది.
Also Read: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు జగన్ సర్కార్ షాక్..?