Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: జగన్ మహిళల కార్డు వెనుక కథ అదా?

CM Jagan: జగన్ మహిళల కార్డు వెనుక కథ అదా?

CM Jagan: ఏపీ సీఎం జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సంక్షేమమే తనకు శ్రీరామరక్షగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. అభివృద్ధి లేదన్న అపవాదును సంక్షేమ పథకాలు అధిగమిస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు తనకు అండగా నిలుస్తారని అంచనా వేస్తున్నారు. సంక్షేమ పథకాలలో మహిళల కే పెద్ద పీట వేయడం.. వారి పేరిటే అందిస్తుండడం కలిసి వస్తుందని బలమైన నమ్మకం ఏర్పరచుకున్నారు. అయితే జగన్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఓటర్ల వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. దాదాపు సగానికి పైగా నియోజకవర్గాల్లో.. పురుషులకంటే మహిళా ఓటర్లు అధికం. ఆ ఆలోచనతోనే జగన్ మహిళలకు సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.

జగన్ అమలు చేసే ప్రతి పథకం లబ్ధిదారులు మహిళలే. వారి ఖాతాల్లోకి నేరుగా నగదు చేరుతోంది. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా వంటి అనేక పథకాలు మహిళల పేరుతోనే నిర్వహిస్తున్నారు. చివరకు రేషన్ కార్డు సైతం మహిళల పేరుతోనే అందిస్తున్నారు. చివరకు గృహ నిర్మాణం కింద మంజూరు చేసిన ఇల్లను సైతం వారి పేరుతోనే అందిస్తున్నారు. వీటన్నింటికి కారణం పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం. దాదాపు 152 నియోజకవర్గాల్లో పురుషుల ఓటర్ల కంటే.. మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ప్రతి 1000 మంది పురుష ఓటర్లు ఉంటే.. 1036 మంది మహిళా ఓటర్లు ఉండడం విశేషం. 18 నుంచి 21 సంవత్సరాల మధ్య మహిళా ఓటర్లు మూడున్నర లక్షల మంది ఉన్నారు. వారిని ప్రభావితం చేసేందుకే జగన్ మహిళల పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి.

రాష్ట్రంలో మహిళలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు ఇలా ఉన్నాయి.కొవ్వూరు, రంపచోడవరం, ఏలూరు, గన్నవరం, పెనమలూరు, పత్తిపాడు, తెనాలి, రామచంద్రపురం, ఒంగోలు, మంగళగిరి, రాజమండ్రి సిటీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికం. 2014లో ప్రతి 1000 మంది పురుష ఓటర్ల కంటే మహిళలు 13 మంది అధికంగా ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 36 కు పెరగడం విశేషం. ఈ లెక్కకు అనుగుణంగానే జగన్ మహిళలకు ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడం గమనార్హం.

గతంలో చంద్రబాబు మహిళా ఓటర్లను టార్గెట్ చేసుకొని సక్సెస్ అయ్యారు. డ్వాక్రా మహిళలతో పాటు మహిళలకు స్వయం ఉపాధి పథకాలను పెద్ద ఎత్తున అమలు చేసేవారు. రుణ రాయితీలు కల్పించి వారి స్వయం సమృద్ధి సాధనకు పాటుపడేవారు. దీంతో మహిళలు టిడిపి ఓటు బ్యాంకు గా మారారు. దీనిని గమనించిన జగన్ మహిళా ఓటర్లను టార్గెట్ చేయడం ప్రారంభించారు. వారి పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసి అభిమానాన్ని చూరగొనాలని చూస్తున్నారు. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version