పోలీసుల కష్టానికి ప్రతిఫలం!

లాక్ డౌన్ టైంలో సరైన విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆరోగ్యంపై కేసీఆర్ ప్రభుత్వం దృష్టి సారించింది. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది నుంచి వారి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి విధుల కేటాయింపు ఉండేలా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేకంగా ఆర్జీలు పెట్టుకోకుండానే వారి పరిస్థితిని అంచనా వేసి శాంతిభద్రతలు, […]

Written By: Neelambaram, Updated On : May 1, 2020 2:40 pm
Follow us on

లాక్ డౌన్ టైంలో సరైన విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆరోగ్యంపై కేసీఆర్ ప్రభుత్వం దృష్టి సారించింది. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది నుంచి వారి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి విధుల కేటాయింపు ఉండేలా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేకంగా ఆర్జీలు పెట్టుకోకుండానే వారి పరిస్థితిని అంచనా వేసి శాంతిభద్రతలు, ట్రాఫిక్ వంటి కష్టంతో కూడిన విధులు కాకుండా మరేదైనా విభాగంలో వారి సేవలను వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.

ఈ మొత్తం వివరాలను పోలీస్ పథకం ఆరోగ్య భద్రతకు లింక్ చేయనున్నారు. ఇప్పటికే ఆరోగ్య భద్రతను టీఎస్ కాప్‌తో అనుసంధానం చేశారు. దీంతో పోలీసుల ఆరోగ్యానికి సంబంధించిన వివారాలు ఉన్నతాధికారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 25 వేల మంది సిబ్బంది ఆరోగ్య వివరాలు సేకరించారు. ఈ నెల 3 వరకు అందరి ఆరోగ్య వివరాలు సేకరించనున్నారు. వీటి ఆధారంగా హెల్త్ క్యాంపులు నిర్వహించడంతో పాటు ఇతర చర్యలు తీసుకోనున్నారు.