spot_img
Homeఆంధ్రప్రదేశ్‌కామినేనిని వదలని సోము వీర్రాజు

కామినేనిని వదలని సోము వీర్రాజు

Kamineni
బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం అయ్యాక పార్టీకి మంచి ఊపు వచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టైమ్‌ను.. సందర్భాన్ని బట్టి ఆయన ప్రభుత్వం పై ఫైర్‌‌ అవుతూనే ఉన్నారు. సమస్యలపై నిలదీస్తూనే ఉన్నారు. అయితే.. అప్పుడప్పుడు ఆయన వ్యవహారశైలి.. ఆ పార్టీ నేతలను షాక్‌కు కన్నా ఎక్కువగా విస్మయానికి గురిచేస్తోంది.

టీడీపీ హయాంలో వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి జరిగిందని.. తక్షణం కేసులు పెట్టాలని సోము ఏపీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఆయన లేఖ రాయడమే ఆలస్యం.. సీఐడీ కూడా కేసు నమోదు చేసింది. రెడ్డి ఎమ్మెల్యే అయిన మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తేనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన సీఐడీ.. సోము వీర్రాజు ఫిర్యాదు చేస్తే కేసు పెట్టకపోవడంలో వింత లేదు. కానీ.. ఇక్కడ అసలు విషయం ఏంటంటే సోము వీర్రాజు ఫిర్యాదు చేసింది ఎవరిపైనా అని తరచి చూస్తే బీజేపీ నేతలకూ తేడాగా అనిపిస్తోంది. సోము ఫిర్యాదు చేసింది సొంత పార్టీ నేత కామినేని శ్రీనివాస్ పైనే.

అవును.. టీడీపీ హయాంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా నాలుగేళ్లు బీజేపీ తరఫున గెలిచిన కామినేని శ్రీనివాస్‌ ఉన్నారు. ఆయన చేతుల మీదుగానే వ్యవహారాలన్నీ నడిచాయి. ఇప్పుడు అదే శాఖపై ఆరోపణలు చేస్తూ సోము వీర్రాజు ప్రభుత్వానికి లేఖ రాసి.. కేసు నమోదవడానికి కారణంగా నిలిచారు. 2015 నుంచి వైద్య, ఆరోగ్య శాఖ టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో దీనిపై అన్ని స్థాయిలలో ఫిర్యాదులు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో దీనిపై విచారణ కూడా జరిగింది. అక్రమాలపై ప్రాథమిక నిర్ధారణ కూడా జరిగింది. తదుపరి చర్యలు తీసుకోలేదు.

ఇప్పుడు ఆ కేసును సోము వీర్రాజు కదిలించారు. టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నామని బీజేపీ నేతలు అనుకుంటూ ఉంటారు కానీ.. అది ఉమ్మడి ప్రభుత్వం అనే సంగతిని మర్చిపోయారని పలువురు అంటున్నారు. టీడీపీ మీద రాళ్లేస్తున్నామని అనుకుంటున్నా.. అది తమ సొంత పార్టీ నేతలకే తగులుతున్నాయని ఆలోచించలేకపోతున్నారు. ఆయన గతంలో దేవాదాయశాఖపై చేసేవారు. అప్పుడు మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు కార్నర్ అయ్యేవారు. ఆయన కరోనాతో చనిపోవడంతో ఇప్పుడు కామినేని సంగతి చూస్తున్నారు. అయితే.. వైసీపీ పెద్దల నుంచి వచ్చిన సూచనల మేరకే సోము వీర్రాజులేఖ రాశారని లేకపోతే ఇప్పుడు లేఖ రాయాల్సిన సందర్భమే లేదని కొంత మంది గుర్తు చేస్తున్నారు. మొత్తంగా సోము ఎపిసోడ్‌ కాస్త సొంత పార్టీ నేతలనే ఆపదలో పడేసే ప్రమాదం తేనుంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper