spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP: వైసీపీ డబుల్ గేమ్: కేంద్రంలో మద్దతు.. రాష్ట్రంలో భారత్ బంద్

YCP: వైసీపీ డబుల్ గేమ్: కేంద్రంలో మద్దతు.. రాష్ట్రంలో భారత్ బంద్

YCP: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ రాష్ర్టంలో వ్యతిరేకిస్తూ తనలోని నైజాన్ని బయటపెడుతున్నారు. రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వైసీపీ తదనంతర పరిణామాల్లో కూడా బీజేపీని గట్టెక్కించేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలోప్రస్తుతం జగన్ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఢిల్లీలో ఒకలా రాష్ర్టంలో మరోలా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనుమానాలకు తావిస్తున్నారు.
YCP
కీలకమైన వ్యవసాయ బిల్లులు, విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనూ కేంద్రానికి మద్దతు తెలిపి బిల్లులు చట్టాలు కావడానికి సహకరించిన వైసీపీనే ప్రస్తుతం రాష్ర్టంలో వాటికి వ్యతిరేకంగా పోరాడటం వింత కలిగిస్తోంది. రైతు సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త బంద్ లో భాగంగా ఏపీలో జరిగే బంద్ కు వైసీపీ మద్దతు పలకడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు మొదటి నుంచి సహకారం అందిస్తున్న వైసీపీ అకస్మాత్తుగా మద్దతు ఉపసంహరించుకోవడం సంచలనం కలిగిస్తోంది.

కీలక బిల్లుల్లో కేంద్రానికి మద్దతిస్తూ రాష్ర్ట ప్రయోజనాలను కాపాడుకోవాలని భావించిన రాష్ర్టం ఏ విధమైన లాభాలను మాత్రం పొందలేకపోయింది. పోలవరం విషయంలో జాతీయ హోదా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తదితర అంశాలు వైసీపీకి గుదిబండలుగా మారాయి. దీంతో వైసీపీ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రంతో తెగదెంపులు చేసుకోవాలనే చూస్తున్నట్లు సమాచారం.

దేశంలో రైతులకు నష్టం కలిగించే రైతు చట్టాలను వైసీపీ మద్దతు తెలపడంతో అవి కాస్త చట్టాలుగా మారాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఏడాదిగా రైతు సంఘాల ఆధ్వర్యంలో చట్టాలు రద్దు చేయాలని పోరాటాలు సాగుతున్నాయి. కానీ కేంద్రం మాత్రం పట్టు విడవడం లేదు. దీంతో ఉద్యమం కాస్త ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో వైసీపీ ఉద్యమానికి మద్దతు తెలపడం అందరిలో సందేహాలకు కారణమవుతోంది.

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కూడా వైసీపీ కేంద్ర నిర్వాకానికి ఎదురు చెప్పలేకపోయింది. దీంతో ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం ప్రయత్నిస్తుండడంతో ప్రస్తుతం రాబోయే ఎన్నికలకు అడ్డంకిగా మారుతుందనే ఉద్దేశంతో కేంద్రంతో విభేదించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కార్మికులతో కలిసి పోరు సల్పేందుకే నిశ్చయించుకున్నట్లు సమాచారం. తాజాగా భారత్ బంద్ కు సహకరిస్తూ వైసీపీ రైతుల మద్దతు కూడగట్టుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper