
రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణా అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్ర స్థాయిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమీషనర్ గా వినీత్ బ్రిజ్ లాల్ ను నియమించారు. జిల్లాల వారీగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులగా ఏఎస్పీ లను ప్రభుత్వం నియమించింది. గుంటూరు రూరల్ జిల్లా కు కె.ఆరిఫ్ హఫీజ్, తూర్పు గోదావరి జిల్లాకు గరుడ్ సుమిత్ సునీల్, విశాఖపట్నం రూరల్ జిల్లాకు రాహుల్ దేవ్ సింగ్ విశాఖ సిటీకి అజిత వేజెండ్ల, కర్నూలు జిల్లాకు గౌతమి శాలి, కృష్ణా జిల్లాకు వకుల్ జిందాల్, చిత్తూరు జిల్లాకు రిషాంత్ రెడ్డిలను ప్రభుత్వం నియమించింది.
ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రూపుదిద్దుకుంది.రాష్ట్రంలో అక్రమ మద్యం, అక్రమ ఇసుక రవాణా అరికట్టాలని లక్ష్యంతో బ్యూరోను ఏర్పాటు చేశారు. ఆన్ని జిల్లాల వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టి ఇసుక అక్రమ రవాణాను, అక్రమ మద్యాన్ని నిరోధించేలా ఈ యంత్రాంగం ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయనుంది.